Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాపురం చక్కదిద్దమని వెళితే కామాంధుడిగా మారిన పోలీస్.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 28 జులై 2020 (18:50 IST)
కాపురం చక్కదిద్దమని పోలీసు స్టేషనుకు వెళ్ళిన ఓ మహిళను కోరిక తీర్చమని వేధించాడు ఓ పోలీసు. మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించి సస్పెండ్‌కు గురయ్యాడు.
 
నల్గొండ జిల్లా నకిరేకల్లు మండలం బోదుకగూడెంకు చెందని ఒక మహిళ భర్తతో మనస్పర్థలు రావడంతో అతనికి దూరంగా ఉంది. ఇద్దరు పిల్లలను భర్త దగ్గరే వదిలేసి ఒంటరిగా ఉంటోంది. కాపురం చక్కదిద్దాలంటూ పోలీసులను ఆశ్రయించింది.
 
అక్కడ హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేసే రఘు ఆమెపై కన్నేశాడు. ఆమె నెంబర్ తీసుకుని తరచూ ఫోన్ చేయడం ప్రారంభించాడు. న్యాయం చేస్తానంటూ మాటలు కలిపిన హెడ్ కానిస్టేబుల్ ఆ తరువాత తనలోని కాముడ్ని నిద్రలేపాడు. తన కోరిక తీర్చాలంటూ లైంగికంగా వేధించాడు.
 
ఫోన్‌లో బెదిరించే చర్యలకు దిగాడు. దీంతో బాధితురాలు తన పుట్టింటి వారికి విషయం చెప్పింది. నకిరేకల్‌లోని ప్రజాప్రతినిధిని బాధితులు ఆశ్రయించారు. రెండురోజుల క్రితం ఆ ప్రజాప్రతినిధి తన క్యాంప్ కార్యాలయానికి రఘును పిలిచి వార్నింగ్ ఇచ్చాడు. అతనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఉన్నతాధికారులను ఆదేశించాడు. హెడ్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం