Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

13ఏళ్ల విద్యార్థినిపై ఉపాధ్యాయులు సామూహిక అత్యాచారం...

13ఏళ్ల విద్యార్థినిపై ఉపాధ్యాయులు సామూహిక అత్యాచారం...
, ఆదివారం, 26 జులై 2020 (14:07 IST)
13 ఏళ్ల విద్యార్థినిపై పాఠశాల ఉపాధ్యాయులు సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డ దారుణమైన ఘటన రాజస్థాన్ ఆల్వార్ జిల్లాలోని నారాయణ్‌పూర్‌లో చోటుచేసుకుంది. బుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే నీచమైన ఘటనకు ఒడిగట్టారు. పాఠశాల మేనేజర్‌తో పాటు ఉపాధ్యాయులు, పలువురు సిబ్బంది సైతం ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. 
 
బాలిక అనారోగ్యానికి గురికావడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. దీంతో మొత్తం 13 మందిపై నారాయణ్‌పూర్‌ పోలీసులు పోక్సో, ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
 
ఏడాది కాలంగా బాలికపై అత్యాచారానికి పాల్పపడుతున్నారని, ఈ విషయం ఎవరికైన చెబితే చంపుతామని బాలికలను బెదిరించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నిందితులకు సహకరించిన ముగ్గురు మహిళా సిబ్బందిపై కూడా కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణలో కొత్తగా 1500 కేసులు.. ఎనిమిది మంది మృతి