తెలంగాణలో అరుదైన మూషిక శిల్పం.. గణపతి దేవుడి కాలానికి..?

Webdunia
గురువారం, 9 సెప్టెంబరు 2021 (16:14 IST)
తెలంగాణలో అరుదైన మూషిక శిల్పం బయటపడింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మండలం జనగాంలోని శిథిలంగా మారిన శివాలయం వద్ద ఈ విగ్రహం బయల్పడింది. ఈ శివాలయం 800 ఏళ్ల నాటిది. 
 
ఈ విగ్రహానికి సంబంధించి పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో ఈమని శివనాగిరెడ్డి మాట్లాడుతూ, కాకతీయుల కాలం నాటి త్రిలింగ రాజరాజేశ్వర ఆలయం ఎదురుగా ఉన్న త్రికూటాలయంలో తుప్పలు, పొదలు తొలగిస్తుండగా గణపతి వాహనం వెలుగుచూసిందని చెప్పారు.
 
ఈ శిల్పం 3 అడుగుల పొడవు, రెండున్నర అడుగుల ఎత్తు ఉందని శివనాగిరెడ్డి తెలిపారు. తెలంగాణలో ఇదే అతిపెద్ద మూషిక విగ్రహమని చెప్పారు. సర్వాభరణాలతో అలంకరించినట్టున్న ఈ శిల్పం గణపతిదేవుడి కాలానికి చెందినదని తెలిపారు. 
 
త్రికూటాలయంలో రెండు ఆలయాల్లో శివలింగాలు ఉన్నాయని. మూడో ఆలయం వినాయకుడిది అయిఉండొచ్చని చెప్పారు. గుప్తనిధుల కోసం ఈ విగ్రహాన్ని పెకిలించి ఉండొచ్చని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi proud: ప్రధాని కలవడం అక్కడ న్యూ ఏజ్ మెగాస్టార్ టైటిల్ ఇవ్వడం తండ్రిగా గర్వంగా వుంది

Trisha: అభిమానులు గోల చేసాక విజయ్‌కు విషెస్ చెప్పిన త్రిష

Ramcharan and modi: న్యూఢిల్లీలో రిపబ్లిక్ సమ్మిట్‌లో మోదీతో రామ్ చరణ్, అనిల్ కపూర్

Manchu Lakshmi: క్రియేటర్స్ కు ఇన్ఫ్లుయెన్సర్స్ కు మధ్య తేడా ఉంది :మంచు లక్ష్మి

సినిమా అనేది చౌకైన వినోద సాధనం, పాప్‌కార్న్, స్నాక్స్ ధరలు తగ్గితే? చెర్రీ

తర్వాతి కథనం
Show comments