Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో బీజేపీ - జనసేన పొత్తు పొడుస్తుందా? పవన్‌తో కిషన్ రెడ్డి భేటీ!

Webdunia
బుధవారం, 18 అక్టోబరు 2023 (20:40 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి వచ్చే నెలలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార భారాస, కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్, భారాస పార్టీలు ఒంటరిగా పోటీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవాలని భావిస్తుంది. ఇదే విషయంపై హైదరాబాద్ నగరంలో జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్‌తో కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి, మరో సీనియర్ నేత లక్ష్మణ్‌లు బుధవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 
 
ఈ ఎన్నికల్లో తమ పార్టీ 32 స్థానాల్లో పోటీ చేస్తుందని తెలంగాణ జనసేన పార్టీ నేతలు ప్రకటించారు. ఈ క్రమంలో అధికారమే లక్ష్యంగా దూసుకెళుతున్న బీజేపీ.. ఏపీలోని మిత్రపార్టీ జనసేనను కలుపుకుని తెలంగాణ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తుంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. అభ్యర్థుల ప్రకటనకు ముందు తెలంగాణాలో జనసేనతో ఉమ్మడి పోటీ గురించి బీజేపీ నేతలు బుధవారం ఆ పార్టీ అధినేత పవన్‌తో భేటీ అయ్యారు. ఈ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేసే అంశంపై వారంతా చర్చలు జరిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments