Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో కొవిడ్‌ తగ్గుముఖం, గత 18 రోజుల్లో 4 శాతానికి పైగా దిగువకు

Webdunia
బుధవారం, 19 మే 2021 (18:07 IST)
రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ మేరకు వైద్యఆరోగ్యశాఖ నివేదిక విడుదల చేసింది. ఈ నెల 1 నుంచి 18 వరకు కరోనా వైరస్‌ పాజిటివిటీ రేటు 4.17 శాతానికి తగ్గినట్లు పేర్కొంది. గడిచిన 18 రోజుల్లో కోలుకున్నవారి శాతం 81.57 నుంచి 90.48 శాతం వరకు పెరిగినట్లు వెల్లడించింది.
 
* ఈ నెలలో కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టిన విధానాన్ని కూడా వైద్య, ఆరోగ్య శాఖ ఆ నివేదికలో వివరించింది. ఈనెల 1న 7,430 కొత్త కేసులు నమోదైతే.. 18న 3,982 కొత్త పాజిటివ్‌లు నిర్ధారణ అయ్యాయి.
 
* మార్చి 1న 9.73 శాతం పాజిటివ్‌ రేటు నమోదవగా.. ఈ నెల 18న 5.56 శాతానికి తగ్గింది.
 
* ఇందులోనూ తొలివారం గడిచేసరికి 8.69 శాతానికి తగ్గగా రెండోవారం ముగిసే సరికి 7.22 శాతానికి తగ్గుముఖం పట్టింది.
 
* గతేడాది సెప్టెంబరు 3 నాటికి 42 ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చికిత్స అందగా ప్రస్తుతం వాటి సంఖ్య 112కు పెరిగింది. ప్రభుత్వ వైద్యంలో పడకలు కూడా 8,052 నుంచి 15,297కు పెరిగాయి. అలాగే గత సెప్టెంబరు 3 నాటికి 194 ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవిడ్‌ చికిత్స అందగా.. ప్రస్తుతం 1,153 ప్రైవేటు ఆసుపత్రుల్లో ఈ చికిత్స చేస్తున్నారు. ప్రైవేటులో పడకల సంఖ్యను కూడా 10,180 నుంచి 38,459కు పెంచారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లంచ‌గొండుల‌పై సేనాప‌తి స్వైర విహారం భారతీయుడు 2’ ట్రైలర్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments