Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో కొవిడ్‌ తగ్గుముఖం, గత 18 రోజుల్లో 4 శాతానికి పైగా దిగువకు

Webdunia
బుధవారం, 19 మే 2021 (18:07 IST)
రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ మేరకు వైద్యఆరోగ్యశాఖ నివేదిక విడుదల చేసింది. ఈ నెల 1 నుంచి 18 వరకు కరోనా వైరస్‌ పాజిటివిటీ రేటు 4.17 శాతానికి తగ్గినట్లు పేర్కొంది. గడిచిన 18 రోజుల్లో కోలుకున్నవారి శాతం 81.57 నుంచి 90.48 శాతం వరకు పెరిగినట్లు వెల్లడించింది.
 
* ఈ నెలలో కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టిన విధానాన్ని కూడా వైద్య, ఆరోగ్య శాఖ ఆ నివేదికలో వివరించింది. ఈనెల 1న 7,430 కొత్త కేసులు నమోదైతే.. 18న 3,982 కొత్త పాజిటివ్‌లు నిర్ధారణ అయ్యాయి.
 
* మార్చి 1న 9.73 శాతం పాజిటివ్‌ రేటు నమోదవగా.. ఈ నెల 18న 5.56 శాతానికి తగ్గింది.
 
* ఇందులోనూ తొలివారం గడిచేసరికి 8.69 శాతానికి తగ్గగా రెండోవారం ముగిసే సరికి 7.22 శాతానికి తగ్గుముఖం పట్టింది.
 
* గతేడాది సెప్టెంబరు 3 నాటికి 42 ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చికిత్స అందగా ప్రస్తుతం వాటి సంఖ్య 112కు పెరిగింది. ప్రభుత్వ వైద్యంలో పడకలు కూడా 8,052 నుంచి 15,297కు పెరిగాయి. అలాగే గత సెప్టెంబరు 3 నాటికి 194 ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవిడ్‌ చికిత్స అందగా.. ప్రస్తుతం 1,153 ప్రైవేటు ఆసుపత్రుల్లో ఈ చికిత్స చేస్తున్నారు. ప్రైవేటులో పడకల సంఖ్యను కూడా 10,180 నుంచి 38,459కు పెంచారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments