Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆయన ట్విట్టర్ కే పరిమితం.. కేటీఆర్ పై డీకే అరుణ ఫైర్

Webdunia
సోమవారం, 8 జులై 2019 (08:47 IST)
టీఆర్ఎస్ నాయకులు కమీషన్ ఏజెంట్లుగా వ్వవహరిస్తున్నారని అన్నారు బీజేపీ నాయకురాలు డీకే అరుణ. నిజామాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆమె..  ప్రాజెక్టులకు పైసలు కర్చుపెడుతున్నామంటూ…  వేల కోట్ల ధనాన్ని టీఆర్ఎస్ నాయకులు దోచుకుంటున్నారని ఆరోపించారు.
తొందరలోనే టీఆర్ఎస్ చేసిన అవినీతిని తాము బయటపెడతామని ఆమె అన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని అసహ్యించుకుంటున్నారని తెలిపారు. టీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయం అని చెప్పారు.
 
రానున్న మున్సిపల్ ఎన్నికల్లో జీజేపీ విజయం సాధిస్తుందని  చెప్పారు అరుణ. సీఎం కొడుకు కేటీఆర్ ప్రాథినిధ్యం వహిస్తున్న స్థానంలో బీజేపీ ఎంపీ స్థానాన్ని గెలుచుకుందని అన్నారు. కవిత స్థానాన్ని కూడా బీజేపీ  గెలుచుకోవడాన్ని ఆమె గుర్తు చేశారు.
అవినీతికి తావు లేదన్న కేసీఆర్.. ఆయన బిడ్డ కవిత పై చాలా ఆరోపణలు వచ్చినా విచారణ జరిపించలేదని చెప్పారు. ఇక.. కేటీఆర్ ట్విట్టర్ కి పరిమితం అయ్యారని ఎద్దేవాచేశారు అరుణ. తెలంగాణ దేశానికి ఆదర్శం అనడం పచ్చి అబద్ధమని చెప్పారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments