Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ హల్వా టేస్ట్ చేస్తే మళ్లీమళ్లీ కావాలంటారు...

Webdunia
ఆదివారం, 23 ఆగస్టు 2020 (20:21 IST)
కరోనావైరస్ దెబ్బకు స్వీట్ షాపుల్లో ఏమయినా కొనాలంటే భయం కలుగుతోంది. ఆ పదార్థాల ద్వారా వైరస్ వస్తుందేమోనన్న జంకు చాలామందిలో వుంటుంది. ఐతే పిల్లలు మాత్రం చిరుతిళ్లు కోసం ఆరాటపడుతుంటారు. కనుక ఈ క్రింది రెసిపీ ట్రై చేసి చూడండి
 
కావలసిన పదార్థాలు: 
బియ్యం పిండి: 250 గ్రాములు
పంచదార: పావు కిలో 
మిక్సిడ్ డ్రై ఫ్రూట్స్: 150 గ్రాములు 
జీడిపప్పు: 50 గ్రాములు 
పాలు: ఒక కప్పు 
యాలకుల పొడి: ఒక టీ స్పూన్ 
రోజ్ వాటర్: రెండు టేబుల్ స్పూన్లు 
 
ఇలా చేయండి:
మందపాటి అడుగుతో కూడిన పాన్‌ను తీసుకుని అందులో పాలతో కలిపిన బియ్యం పిండి మిశ్రమాన్ని ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. అందులో పంచదార చేర్చి పిండి ఉడికింతేవరకు తక్కువ మంటమీద కలుపుతూ ఉడికించాలి. ఉడికిన తర్వాత స్టౌ నుంచి దించి పక్కన పెట్టుకోండి. విడిగా ఓ పాత్రలో అరకప్ పంచదార, అరకప్పు నీటితో చిక్కని పాకం రానివ్వాలి. ఈ పాకంలో రోజ్‌వాటర్, తరిగిన డ్రైఫ్రూట్స్‌ను కలిపి ఉడికించిన బియ్యం పిండి మిశ్రమంలో కలిపాలి. తర్వాత నేతితో వేయించిన జీడిపప్పును వేసి అలంకరించి సర్వ్ చేయొచ్చు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments