Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిరివెన్నెల వాన పాట... వినాల్సిందే (Video)

Webdunia
బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (16:08 IST)
సినీ గేయ రచయితల్లో సిరివెన్నెల సీతారామశాస్త్రికి ప్రత్యేక స్థానం ఉంది. ఆక్రోశం, ఆవేదన, ప్రేమ, విరహం, హాస్యం ఇలా వివిధ నేపథ్యాలకు పాటలు వ్రాసి, తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన గేయరచయితల్లో శాస్త్రి గారు గుర్తుండిపోతారు. తెలుగు పాటలు కరువైపోతున్న కాలంలో కూడా తన కలంతో తెలుగు భాషకు పట్టాభిషేకం చేస్తున్న శాస్త్రి గారు రచించిన పాటలు చాలా మందికి స్పూర్తిదాయకంగా నిలుస్తున్నాయి. 
 
శాస్త్రి గారు చేస్తున్న కృషికి భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. కాస్త ఆలస్యం అయినప్పటికీ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. శ్రాస్త్రి గారు రచించిన పాటలలో ఇప్పుడు మనం ఒక పాటను గుర్తు చేసుకుందాం.
 
తరాలు మారినా, యుగాలు మారినా, హీరోలు మారినా, హీరోయిన్‌లు మారినా భాష మాత్రం అలాగే ఉంటుందని చెప్పేందుకు నిదర్శనంగా ఉండే ఒక మధుర గీతం - చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా అనే పాట అమ్మాయి యొక్క మనస్థత్వాన్ని సినిమాలో కళ్లకు కట్టినట్టు ఆవిష్కృతం చేసారు శాస్త్రి గారు. 
 
ఇందులో నటించిన ఉదయకిరణ్, ఆర్తీ అగర్వాల్, సుజాత ప్రస్తుతం భౌతికంగా మన మధ్య లేకపోయినా వారి నటన మనకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. స్వచ్ఛమైన తెలుగు పదాలతో రాసిన ఆ గీతం ఆ సంవత్సరం నంది అవార్డుల్లో ఉత్తమ గాయని అవార్డును తెచ్చిపెట్టింది. ఆ పాటను మీరు కూడా ఓసారి చూడండి.. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పహల్గామ్ దాడి నుంచి తృటిలో తప్పించుకున్న కేరళ హైకోర్టు జడ్జీలు!!

అఘోరీకి బెయిల్ ఎపుడు వస్తుందో తెలియదు : లాయర్ (Video)

Pahalgam Terrorist Attack పహల్గామ్ దాడితో కాశ్మీర్ పర్యాటకం నాశనం: తిరుగుముఖంలో పర్యాటకులు

పహల్గామ్ ఉగ్రదాడి : పాకిస్థాన్‌పై భారత దాడికి ప్లాన్!!

టెన్త్ రిజల్ట్స్ : కాకినాడ విద్యార్థిని నేహాంజనికి 600/600 మార్కులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments