Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొడనాడు హత్యలు.. ఎడప్పాడి హస్తం.. నిందితుడు సయాన్

Webdunia
శనివారం, 12 జనవరి 2019 (13:03 IST)
దివంగత సీఎం జయలలిత కొడనాడు ఎస్టేట్‌లో జరిగిన అనుమానాస్పద మృతుల కేసులో నిందితుడైన సయాన్.. తెహల్కా మాజీ ఎడిటర్ మాథ్యూ శామ్యూల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన ఆరోపణలు చేశాడు. తెహల్కా విడుదల చేసిన ఈ వీడియో ప్రస్తుతం తమిళనాట సంచలనం సృష్టిస్తోంది.


ఈ హత్యల మిస్టరీ వెనక సీఎం పళనిస్వామి హస్తం వుందని సయాన్ ఆరోపించాడు. ఎస్టేట్‌లో జరిగిన దోపిడీలో వాచ్‌మన్ మృతి చెందగా, ఈ కేసులో అరెస్ట్ అయిన జయలలిత మాజీ కారు డ్రైవర్ కనకరాజ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. 
 
ఇక, మరో నిందితుడైన సయాన్ కేరళలో తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో వెళ్తుండగా జరిగిన ప్రమాదం నుంచి బయటపడినా, ఆయన భార్య విష్ణుప్రియ, కుమార్తె ప్రాణాలు కోల్పోయారు. కొడనాడు ఎస్టేట్‌లో సీసీటీవీ కెమెరాలను పరిశీలించే యువకుడు ఒకరు ఉరేసుకుని మరణించాడు.
 
ఈ మొత్తం మృతుల వెనుక తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిస్వామి ప్రమేయం ఉందని ఇంటర్వ్యూలో సయాన్ ఆరోపించాడు. ఈ వీడియో వ్యవహారంపై తమిళ మంత్రి జయకుమార్ స్పందించారు. నిందితుడిని ఇంటర్వ్యూ చేసిన మాథ్యూ శామ్యూల్‌‌పై కేసు వేయనున్నట్టు తెలిపారు.
 
అయితే ఎడప్పాడిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సయాన్ వ్యాఖ్యలపై ఎడప్పాడి వివరణ ఇవ్వాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నారు. అమ్మ పాలన అమ్మ పాలన అని చెప్పుకుంటున్న ఎడప్పాడి.. అమ్మ మృతికి కారణమయ్యారా లేదా అనేది కూడా చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments