Webdunia - Bharat's app for daily news and videos

Install App

అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తాం: రాహుల్ గాంధీ

Webdunia
శనివారం, 12 జనవరి 2019 (12:06 IST)
కేంద్రంలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. విభజన తర్వాత ఏపీకి దక్కాల్సిన న్యాయమైన హామీలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విస్మరించారని.. మనం కలిసి ఏపీకి ఇవ్వాల్సిన రుణం గురించి మోదీకి, కేంద్ర సర్కారుకు అర్థమయ్యేలా చెప్పాలని రాహుల్ గాంధీ దుబాయ్‌లో అన్నారు. 
 
దుబాయ్‌లో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ.. భారతీయ కార్మికులను కలిసి వారితో పలు అంశాలపై ముచ్చటించారు. గత ఏడాది ఢిల్లీ జంతర్‌మంతర్‌లో ఏపీ నేతల ఆందోళన సందర్భంగా తాను ప్రత్యేక హోదాపై ప్రకటన చేశానని.. దానికి కట్టుబడి ఉన్నానని చెప్పారు. 
 
విభజనతో నష్టపోయిన ఏపీకి న్యాయం జరగాల్సిందేనని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. దుబాయ్‌ అభివృద్ధిలో భారతీయ కార్మికుల పాత్ర కీలకమని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా కొనియాడారు. దుబాయ్‌లో ఉన్న రాహుల్.. భారత పారిశ్రామికవేత్తలతోనూ సమావేశమయ్యారు. స్వదేశంలో పెట్టుబడులు పెట్టి యువతకు ఉద్యోగాలు కల్పించాలని, వ్యవసాయాభివృద్ధికి సహకరించాలని వారిని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments