Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యాచారణ ఆరోపణలు - రాజస్థాన్ మంత్రి తనయుడికి సమన్లు

Webdunia
సోమవారం, 16 మే 2022 (11:54 IST)
రాజస్థాన్ రాష్ట్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత మహేష్ జోషి కుమారుడు రోహిత్ జోషికి ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీచేసింది. యువతిపై అత్యాచారం చేసినట్టు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీ కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. ఈ నోటీసుల్లో ఈ నెల 18వ తేదీన కోర్టులో హాజరుకావాలని పేర్కొన్నారు. 
 
కాగా, పెళ్ళిచేసుకుంటానని నమ్మించి జనవరి 8వ తేదీ నుంచి ఏప్రిల్ 17వ తేదీ వరకు పలుమార్లు అత్యాచారం జరిపినట్టు జైపూర్‌కు చెందిన 23 యేళ్ళ యువతి ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పైగా, ఈ ఫిర్యాదు చేయడంతో తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని అందువల్ల తనకు రక్షణ కల్పించాలని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు. 
 
ఈ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కేసులో విచారణ, అరెస్టు చేసేందుకు ఢిల్లీ పోలీసులు జైపూర్‌కు వెళ్లగా రోహిత్ జోషి అందుబాటులో లేకపోవడం లేదా మొబైల్ ఫోన్ స్విచాఫ్ చేయడం వంటి సంఘటనలు జరిగాయి. ఇదే విషయాన్ని కోర్టుకు తెలుపగా, సమన్లు జారీ చేసింది. వీటిని ఆయన ఇంటికి అతికించాలని ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments