Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యాచారణ ఆరోపణలు - రాజస్థాన్ మంత్రి తనయుడికి సమన్లు

Webdunia
సోమవారం, 16 మే 2022 (11:54 IST)
రాజస్థాన్ రాష్ట్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత మహేష్ జోషి కుమారుడు రోహిత్ జోషికి ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీచేసింది. యువతిపై అత్యాచారం చేసినట్టు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీ కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. ఈ నోటీసుల్లో ఈ నెల 18వ తేదీన కోర్టులో హాజరుకావాలని పేర్కొన్నారు. 
 
కాగా, పెళ్ళిచేసుకుంటానని నమ్మించి జనవరి 8వ తేదీ నుంచి ఏప్రిల్ 17వ తేదీ వరకు పలుమార్లు అత్యాచారం జరిపినట్టు జైపూర్‌కు చెందిన 23 యేళ్ళ యువతి ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పైగా, ఈ ఫిర్యాదు చేయడంతో తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని అందువల్ల తనకు రక్షణ కల్పించాలని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు. 
 
ఈ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కేసులో విచారణ, అరెస్టు చేసేందుకు ఢిల్లీ పోలీసులు జైపూర్‌కు వెళ్లగా రోహిత్ జోషి అందుబాటులో లేకపోవడం లేదా మొబైల్ ఫోన్ స్విచాఫ్ చేయడం వంటి సంఘటనలు జరిగాయి. ఇదే విషయాన్ని కోర్టుకు తెలుపగా, సమన్లు జారీ చేసింది. వీటిని ఆయన ఇంటికి అతికించాలని ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments