Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూణేలో జీబీఎస్ పదో కేసు.. 21 ఏళ్ల యువతి కిరణ్ చికిత్స పొందుతూ మృతి

సెల్వి
బుధవారం, 19 ఫిబ్రవరి 2025 (15:24 IST)
GBS Virus
పూణేలో గుల్లెయిన్-బారే సిండ్రోమ్ (GBS) కారణంగా మరణించిన వారి సంఖ్య పదికి చేరింది. తాజాగా 21 ఏళ్ల యువతి కిరణ్ రాజేంద్ర దేశ్‌ముఖ్ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. కిరణ్‌కు మూడు వారాలకు పైగా జీబీఎస్‌తో పోరాడింది.
 
పూణే సంరక్షక మంత్రి అజిత్ పవార్ నియోజకవర్గం, స్వస్థలం అయిన బారామతిలో నివసించే కిరణ్, తన చదువు కోసం సింహగడ్ ప్రాంతంలోని బంధువులతో కలిసి ఉండగా, ఆమెకు ఈ వ్యాధి సోకింది. 
 
ఈ ప్రాంతంలో అనేక జీబీఎస్ కేసులు నమోదయ్యాయి. కిరణ్‌ కూడా ఈ వ్యాధి బారిన పడింది. ప్రారంభంలో, ఆమెకు విరేచనాలు, బలహీనత వంటి లక్షణాలు కనిపించాయి. దీనితో ఆమె కుటుంబ సభ్యులు ఆమెను బారామతికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెకు నిపుణులు పరీక్షలు నిర్వహించారు.
 
బారామతిలో చికిత్స పొందుతున్నప్పటికీ, ఆమె పరిస్థితి మెరుగుపడలేదు. ఆమెకు ఉన్న లక్షణాల ఆధారంగా, వైద్యులు జీబీఎస్‌ని అనుమానించారు. తదుపరి చికిత్స కోసం ఆమెను పూణేలోని ఆసుపత్రిలో చేర్చమని ఆమె కుటుంబ సభ్యులకు సలహా ఇచ్చారు. కిరణ్‌ను జనవరి 27న ఆసుపత్రిలో చేర్చారు. కానీ ఆమె ఆరోగ్యం క్షీణించింది. చికిత్స పొందుతూ మంగళవారం ఆమె మరణించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika : రష్మిక మందన్న పాన్ ఇండియా మూవీ మైసా ఫియర్స్ లుక్

Love Jatara: అంకిత్ కొయ్య, మానస చౌదరి జంటగా లవ్ జాతర

కన్నప్ప మూవీ రివ్యూ- కథ మారింది-కల్పితం: నేటి జనరేషన్ నిజం అని నమ్మే ప్రమాదం వుంది!

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments