Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారులో ఏటీఎం మెషీన్... ఏంటి సంగతి?

Webdunia
బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (16:48 IST)
బీహార్‌ రాష్ట్రంలోని బోథ్‌గయకు చెందిన ధర్మారణ్య సమీపంలో ఒక కారు అనుమానాస్పద స్థితిలో కనిపించింది. దీంతో స్థానికులు బెంబేలెత్తిపోయారు. కారు రోడ్డు మధ్యలో టైరు ఫంక్చరై ఆగిపోయి కనిపించడంతో తీవ్రవాదులు ఎవరైనా ఇలా చేసివుంటారని అనుమానించారు. సమాచారాన్ని పోలీసులకు అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు కారుని పరిశీలించి దానిలో ఏటిఎం మెషిన్ ఉందని కనుగొన్నారు.
 
కొందరు ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు... అగంతకులు ఏటిఎంని కారులో వేసుకుని వెళుతుండగా టైరు పంక్చర్ కావడంతో జనానికి భయపడి అక్కడే వదిలి వెళ్లి ఉండవచ్చొని అన్నారు. కారుని స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించగా ఈ ఏటిఎం ఘుఘరీటాండ్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందినదిగా గుర్తించారు. 
 
ఇది విష్ణుపథ్ పోలీసు స్టేషన్ పరిధిలో ఉందని, టైరు పేలడంతో జనాలు వచ్చేలోగా కారు వదిలి దుండగులు పరారయ్యారని పోలీసులు భావిస్తున్నారు. వారు ఏటిఎంని చోరీ చేసి తరలించడానికి ఉపయోగించిన గ్యాస్‌కట్టర్‌లను కూడా కారులో పోలీసులు కనుగొని స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న దుండగులను పట్టుకోవడానికి చర్యలను ముమ్మరం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

ఎంతో మందితో కలిసి పని చేసినా.. కొంతమందితోనే ప్రత్యేక అనుబంధం : తమన్నా

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments