Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఊరంతా కరెంట్ తీసి.. మీడియా కన్నుగప్పి...

ఊరంతా కరెంట్ తీసి.. మీడియా కన్నుగప్పి...
, మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (15:29 IST)
ఎన్నారై జయరామ్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన మేనకోడలు శిఖా చౌదరిని అత్యంత గోప్యంగా హైదరాబాద్‌కు రలించారు. ఆమెను తరలింపునకు ముందు హైదరాబాద్ నగరంలో హైడ్రామా చోటుచేసుకుంది. 
 
ఈ హత్య కేసులో ఆమెను అరెస్టు చేసిన తర్వాత ఆమెను కృష్ణా జిల్లా నందిగామ పోలీస్ స్టేషన్‌లో ఐదు రోజుల పాటు ఉంచారు. అయితే, ఈ హత్య హైదరాబాద్‌లో జరగడంతో ఆమెను హైదరాబాద్ పోలీసులకు అప్పగించాలని భావించారు. ఇందుకోసం శిఖా చౌదరి ఎవరి కంటా కనిపించకుండా ఉండాలా పోలీసులు ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. 
 
సోమవారం రాత్రి అత్యంత నాటకీయ పరిణామాలు, హైడ్రామా మధ్య రహస్య ప్రాంతానికి తరలించారు. ఊరంతా కరెంట్ తీసేసిన పోలీసులు, అంతకుముందే రెండు వాహనాలను స్టేషన్ ముందు సిద్ధం చేసివుంచారు. ఒక వాహనంలో శిఖాను ఎక్కించారు. ఏ వాహనంలో ఆమె ఉందో మీడియా కంటపడకుండా జాగ్రత్త పడ్డారు. 
 
ఆపై రెండు వాహనాల్లో ఒకటి విజయవాడవైపు, మరొకటి హైదరాబాద్ వైపు వెళ్లిపోయాయి. ఈ వాహనాలను మీడియా వెంబడించినా, ఆమె ఎందులో ఉందన్న విషయం మాత్రం తెలుసుకోలేకపోయారు. కాగా, ఈ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టిక్ టాక్‌లో డబ్ స్మాష్‌లు, వీడియోలు పోస్టు చేస్తున్నారా?