Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మార్ట్ ఫోన్ ఆడుకునేందుకు ఇవ్వలేదని తమ్ముడిని అలా చంపేసింది..

Webdunia
గురువారం, 1 జూన్ 2023 (11:13 IST)
స్మార్ట్ ఫోన్లు మానవ జీవితాన్ని శాసిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ లేనిదే చిన్నా పెద్దలకు పొద్దు గడవడం లేదు. పిల్లలైతే స్మార్ట్ ఫోన్లతో గేమ్‌లతో కాలం గడిపేస్తున్నారు. పెద్దలైతే రకరకాల వీడియోలు చూస్తూ.. సోషల్ మీడియాలో గంటలు గంటలు వెచ్చిస్తున్నారు. 
 
స్మార్ట్ ఫోన్ కోసం ఏదైనా చేసేందుకు రెడీ అవుతున్నారు.. కొంతమంది పిల్లలు. హర్యానాలో స్మార్ట్ ఫోన్ కోసం తమ్ముడినే ఓ సోదరి హత్య చేసింది. కుమారుడికి తల్లిదండ్రులు ఫోన్ కొనిపెట్టారు. కానీ అతడు సోదరికి ఫోని ఇవ్వమని అడిగితే ఇవ్వలేదు. 
 
అంతే ఆవేశానికి గురైన అతడి సోదరి గొంతు నులిమి హత్య చేసింది. తల్లిదండ్రులకు తన తమ్ముడంటేనే ఎక్కువ ఇష్టమని భావించిన ఈ మైనర్ బాలిక.. తమ్ముడిని గొంతు నులిమి చంపేసింది. హరియాణాలోని బల్లభ్‌ఘడ్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. మైనర్ బాలిక, ఆమె తమ్ముడు ఉత్తరప్రదేశ్‌లో తమ నానమ్మ, తాతయ్యల దగ్గర ఉంటున్నారు. 
 
ఇటీవల వేసవి సెలవుల కోసం తల్లిదండ్రుల వద్దకు వచ్చారు. ఈ క్రమంలో తల్లిదండ్రులు బాలుడికి ఓ మొబైల్ ఫోన్ కొనిచ్చారు. అయితే, మంగళవారం బాలుడు తన ఫోన్‌లో గేమ్ ఆడుకుంటుండగా తనకూ కాసేపు ఫోన్ ఇవ్వమని బాలిక అడిగింది. 
 
అతను ఇవ్వకపోవడంతో తమ్ముడి గొంతు నులిమి చంపేసింది.  ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికను జువెనైల్ జస్టిస్ బోర్డు ముందు హాజరు పరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

35వ వార్షికోత్సవంలో అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మ ల శివ

జెండా ఒక ఖడ్గం అనే ఉద్దేశ్యం తో తీశా : ఖడ్గం రీ రిలీజ్ సందర్భంగా కృష్ణవంశీ

రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్ కళ్యాణ్, ఎన్.టి.ఆర్.

రాజేంద్రప్రసాద్ కూతురు మృతి.. గుండెపోటుతో 38 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు...

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments