Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పని ఒత్తిడి నుంచి రిలాక్స్ అయ్యేందుకు ఆఫీసులో మద్యం సేవించవచ్చు..

liquor
, సోమవారం, 15 మే 2023 (09:02 IST)
హర్యానా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పని ఒత్తిడి నుంచి రిలాక్స్ అయ్యేందుకు ఆఫీసులో మద్యం సేవించేందుకు అనుమతి ఇచ్చింది. అయితే, హర్యానా రాష్ట్రంలోని కార్పొరేట్ ఉద్యోగులకు మాత్రం ఇప్పుడీ అవకాశం వచ్చేసింది. ఇక నుంచి అక్కడి కార్పొరేట్ ఉద్యోగులు ఆఫీసులోనే సరదాగా తమ సహచర ఉద్యోగులతో కలిసి చీర్స్ చెప్పి పెగ్గుల మీద పెగ్గులు లాగించొచ్చు! 
 
తక్కువ మోతాదు ఆల్కహాల్ ఉండే బీర్, వైన్ వంటి డ్రింకులను కార్యాలయాల్లోకి అనుమతిస్తూ హర్యానా సర్కారు నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగా 2023-24 సంవత్సరానికిగానూ రూపొందించిన లిక్కర్ పాలసీలో కీలక మార్పులు చేసింది. అలా అని అన్ని ఆఫీసుల్లోనూ మద్యానికి అనుమతి ఉండదు. 
 
ఆఫీసులో కనీసం 5 వేల మంది ఉద్యోగులు ఉండాలి. అంతేనా.. లక్ష చదరపుటడుగుల విస్తీర్ణానికి తక్కువ కాకుండా కార్యాలయ ప్రాంగణం ఉండాలి. అలాగే కనీసం  రెండు వేల ఫీట్లతో క్యాంటిన్ తప్పనిసరి. ఇవన్నీవుండి.. రూ.10 లక్షల వార్షిక ఫీజు కడితేనే సదరు యాజమాన్యానికి తమ కార్యాలయంలో మద్యాన్ని అందుబాటులో ఉంచుకునేందుకు లైసెన్స్ ఇచ్చేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేను ఓడితేనేం.. నా పంతం నెగ్గింది.. జగదీశ్ శెట్టర్