Webdunia - Bharat's app for daily news and videos

Install App

Mangaluru: రోడ్డుపై నడుస్తూ వెళ్లిన మహిళను ఢీకొన్న కారు.. తలకిందులుగా వేలాడుతూ.. (video)

సెల్వి
శుక్రవారం, 14 మార్చి 2025 (14:55 IST)
Woman
మహిళలకు రోడ్డుపై నడవడానికి రక్షణ లేకుండా పోతోంది. ఇప్పటికే ఎక్కడపడితే అక్కడ మహిళలపై అకృత్యాలు జరుగుతున్న వేళ.. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లిన ఓ మహిళపై హత్యాయత్నం జరిగింది. 
 
వివరాల్లోకి వెళితే... కర్ణాటక - మంగళూరులో తన పొరుగింట్లో ఉండే మురళీ ప్రసాద్ అనే వ్యక్తిపై కారుతో ఢీకొని హత్యాయత్నం చేశాడు.. సతీశ్ అనే వ్యక్తి. కానీ మురళిని ఢీకొడుతున్న సమయంలో అటు వైపు నడిచి వెళ్తున్న మహిళను కూడా కారుతో సతీష్ ఢీకొట్టాడు. కారు ఢీకొనడంతో ఓ ఇంటి గోడకు తలకిందులుగా ఆ మహిళ వేలాడింది. 
 
ఈ ఘటనలో మురళితో పాటు ఆ మహిళకు కూడా గాయాలైనాయి. దీన్ని గమనించిన స్థానికులు ఆ మహిళను కాపాడి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సతీష్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. విచారణలో గతంలో మురళి తండ్రిపైన కూడా హత్యాయత్నానికి సతీష్ పాల్పడ్డాడని తెలిసింది. 
 
ఇంకా సతీష్- మురళీల మధ్య వివాదానికి కారణం ఏంటి..? హత్యాయత్నం చేసేంతలా వీరి మధ్య ఏం జరిగిందనే వివిధ కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పోస్టు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సెట్‌లో విరాట్ కర్ణ చిత్రం నాగబంధం

సుహాస్ , కీర్తి సురేష్ నటించిన ఉప్పు కప్పురంబు ట్రెయిలర్ లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments