Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోక్సో కేసులో మాజీ ముఖ్యమంత్రి యడ్డీకి బిగ్ రిలీఫ్!

ఠాగూర్
శుక్రవారం, 14 మార్చి 2025 (14:51 IST)
పోక్సో కేసు నుంచి కర్నాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప(యడ్డీ)కు స్వల్ప ఊరట లభించింది. మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఓ బాలికను లైంగికంగా వేధించారన్న కేసులో యడ్యూరప్ప ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఆయనపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఇందులో న్యాయస్థానం ఆయనకు స్వల్ప ఊరట లభించింది. ఈ నెల 15వ తేదీ ఈ కేసు విచారణ నిమిత్తం కోర్టుకు హాజరుకావాలంటూ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఆదేశించింది. దీనిపై ఆయన కర్నాటక హైకోర్టును ఆశ్రయించగా, కింది కోర్టు సమన్లను నిలిపివేసింది. 
 
కాగా, 17 యేళ్ల బాలికపై యడ్యూరప్ప లైంగికదాడికి పాల్పడినట్టు గతంలో ఆరోపణలు వచ్చాయి. ఓ మోసం కేసులో సాయం చేయాలంటూ బాధితురాలు, ఆమె తల్లి గత యేడాది ఫిబ్రవరి 2వ తేదీన నాడు ముఖ్యమంత్రిగా ఉన్న యడ్యూరప్పను కలిశారు. ఆ సమయంలో తన కుమార్తెను బీజేపీ నేత బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి లైంగికదాడికి పాల్పడ్డారంటూ బాధితురాలి తల్లి ఫిర్యాదు చేసింది. 
 
దీంతో ఆయనపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. అయితే, ఈ ఆరోపణలను యడ్యూరప్ప కార్యాలయం ఖండించింది. ఫిర్యాదుదారు గతంలోనూ పలువురిపై ఇదే తరహా ఆరోపణలు చేశారని పేర్కొంది. ఈ నేపథ్యంలో యడ్యూరప్పకు కర్నాటక హైకోర్టు స్వల్ప ఊరట కల్పించింది. కాగా, ఈ ఆరోపణల కేసు కర్నాటక రాజకీయాలను ఓ కుదుపు కుదిపిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం