Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

4 రోజులు - 3 రాత్రులు... బెంగుళూరు టూరిజం - ట్రాఫిక్ జామ్‌పై పాయ్ వ్యంగ్య ట్వీట్

Advertiesment
bangalore city

ఠాగూర్

, శుక్రవారం, 14 మార్చి 2025 (12:58 IST)
ప్రముఖ ఆర్థికవేత్త, ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ మోహన్ దాప్ పాయ్ బెంగుళూరు ట్రాఫిక్‌ జామ్ కష్టాలపై ఓ వ్యంగ్య ట్వీట్ చేశారు. 4 రోజులు, 3 రాత్రులు బెంగుళూరు టూరిజం అంటూ వ్యంగ్యంగా ఒక చిత్రాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీని ద్వారా నగరంలోని ట్రాఫిక్ సమస్య ఎంత తీవ్రంగా ఉందో తెలియజేస్తూ ఆయన అసహనం వ్యక్తం చేశారు.
 
సిలికాన్ సిటీలోని ఔటర్ రింగ్ రోడ్డు, సిల్క్ బోర్డు జంక్షన్, మారతహళ్లి, హెచ్ఎస్ఆర్ లేఔట్ ప్రాంతాల్లోని ట్రాఫిక్‌ను చూసి ఆయన ఈ పోస్ట్ చేశారు. బెంగుళూరు నగరంలో మౌలిక సదుపాయాల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇది బెంగుళూరుకు ఒక విషాదకరమైన జోక్ అని అభివర్ణిస్తూ, తమ బాధను చూసి నవ్వుకునే మనసు తమకుందని, కానీ పట్టించుకోని ప్రభుత్వం ఉందని ఆయన విమర్శలు చేశారు. ఈ ట్వీట్‌కు నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.
 
పరిశ్రమ, పారిశ్రామిక దిగ్గజాలు హైబ్రిడ్ పని విధానాన్ని లేదాఇంటి నుంచి మరింత పని విధానాన్ని ప్రోత్సహించాలి. ఇది బెంగుళూరు ఉద్యోగులకు కనీసం ఒక్కసారైనా చార్ ధామ్ యాత్ర చేసేందుకు వీలు కలుగుతుంది. లేదంటే ప్రతిరోజూ చార్ జామ్స్ తప్పవు అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కన్యత్వాన్ని వేలానికి పెట్టిన యువతి: రూ. 18 కోట్లకు దక్కించుకున్న నటుడు