Webdunia - Bharat's app for daily news and videos

Install App

పక్కింటితో గొడవ, మూత్రం తాగించారు, ఆత్మహత్య చేసుకున్నాడు..

Webdunia
శుక్రవారం, 15 మే 2020 (12:07 IST)
మధ్యప్రదేశ్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పక్కింటి వారితో ఏర్పడిన జగడం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. పక్కనే వున్న కుటుంబంలో జరిగిన గొడవ కారణంగా బలవంతంగా మూత్రం తాగించడంతో.. ఆ అవమానం తాళలేక మధ్యప్రదేశ్ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌ శివపురి జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. వికాశ్‌ శర్మ అనే వ్యక్తి తాగునీరు తీసుకొచ్చేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో పక్కనే కుటుంబంతో వికాశ్‌ శర్మకు గొడవ జరిగింది. దీంతో శర్మను తీవ్రంగా చితకబాది, బలవంతంగా మూత్రం తాగించారు.
 
ఈ అవమానాన్ని తట్టుకోలేని శర్మ.. తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంకా అక్కడ సూసైడ్‌ నోట్‌ లభ్యమైంది. పక్కింట్లో ఉన్న మనోజ్‌ కోలి, తారావతి కోలి, ప్రియాంక కోలి కలిసి తనను కొట్టారని, మూత్రం తాగించారని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్‌ నోట్‌లో శర్మ పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.

శర్మ హత్య కేసులో నిందితులైన మనోజ్‌, తారావతి, ప్రియాంకను పోలీసులు అరెస్టు చేశారు. ఈ రెండు కుటుంబాల మధ్య గత ఏడాదిన్నర కాలం నుంచి వివాదాలు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments