Webdunia - Bharat's app for daily news and videos

Install App

పక్కింటితో గొడవ, మూత్రం తాగించారు, ఆత్మహత్య చేసుకున్నాడు..

Webdunia
శుక్రవారం, 15 మే 2020 (12:07 IST)
మధ్యప్రదేశ్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పక్కింటి వారితో ఏర్పడిన జగడం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. పక్కనే వున్న కుటుంబంలో జరిగిన గొడవ కారణంగా బలవంతంగా మూత్రం తాగించడంతో.. ఆ అవమానం తాళలేక మధ్యప్రదేశ్ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌ శివపురి జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. వికాశ్‌ శర్మ అనే వ్యక్తి తాగునీరు తీసుకొచ్చేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో పక్కనే కుటుంబంతో వికాశ్‌ శర్మకు గొడవ జరిగింది. దీంతో శర్మను తీవ్రంగా చితకబాది, బలవంతంగా మూత్రం తాగించారు.
 
ఈ అవమానాన్ని తట్టుకోలేని శర్మ.. తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంకా అక్కడ సూసైడ్‌ నోట్‌ లభ్యమైంది. పక్కింట్లో ఉన్న మనోజ్‌ కోలి, తారావతి కోలి, ప్రియాంక కోలి కలిసి తనను కొట్టారని, మూత్రం తాగించారని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్‌ నోట్‌లో శర్మ పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.

శర్మ హత్య కేసులో నిందితులైన మనోజ్‌, తారావతి, ప్రియాంకను పోలీసులు అరెస్టు చేశారు. ఈ రెండు కుటుంబాల మధ్య గత ఏడాదిన్నర కాలం నుంచి వివాదాలు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments