Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై బీచ్ స్టేషనులో ఫ్లాట్‌ఫాం పైకి దూసుకొచ్చిన రైలు

Webdunia
ఆదివారం, 24 ఏప్రియల్ 2022 (19:25 IST)
చెన్నై బీచ్ రైల్వే స్టేషనులో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆదివారం సాయంత్రం ఓ సబర్బన్ రైలు అదుపుతప్పి ఫ్లాట్‌ఫాంపైకి దూసుకొచ్చింది. ఈ విద్యుత్ రైలు నియంత్రణ కోల్పోడంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే, అదృష్టవశాత్తు డ్రైవరు కిందికి దూకేయడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే, ఈ రైలు మాత్రం పట్టాలు తప్పి  ఫ్లాట్‍ఫాంపైకి దూసుకెళ్లి అక్కడ నుంచి ఫ్లాట్‌పాంను చివరి భాగాన్ని ఢీకొట్టింది. 
 
ఈ క్రమంలో రైలు ఫ్లాట్‌ఫాంపైకి ఎక్కింది. దీంతో స్టేషన్ పైకప్పు కూడా దెబ్బతింది. రైలు ప్రమాదానికి గురైన సమయంలో రైలులో ప్రయాణికులు లేరు. ఈ రైలు షెడ్డు నుంచి బీచ్ స్టేషన్‌కు వచ్చింది. పైగా, ఆదివారం కావడంతో రైల్వే స్టేషనులో కూడా ప్రయాణికుల సంఖ్య పెద్దగా లేదు. దీంతో ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. 
 
ఈ ప్రమాదం గురించి దక్షిణ రైల్వే ప్రధాన పీఆర్వో బి.గుహనేశన్ మాట్లాడుతూ, ప్రమాదానికి గురైన రైలు షెడ్డు నుంచి బీస్ స్టేషన్‌ ఒకటో నంబరు ఫ్లాట్‌ఫాంపైకి వచ్చిందని. అయితే, నియంత్రణ కోల్పోయిన రైలు ఫ్లాట్‌ఫాంను ఢీకొట్టిందని ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం లేదన్నారు. మరోవైపు, ఈ ప్రమాదంపై విచారణ కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరిపిస్తామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments