Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళలో నిపా వైరస్ కలకలం: ఐసోలేషన్‌లోకి 68 మంది

Webdunia
బుధవారం, 8 సెప్టెంబరు 2021 (17:48 IST)
కేరళలో నిపా వైరస్ కలకలం కొనసాగుతూనే ఉన్నది. నిపా వైరస్ కారణంగా ప్రస్తుతం కోజికోడ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో 68 మంది ఐసోలేషన్‌లో ఉన్నారని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జి తెలిపారు. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం ఆమె ఒక ప్రకటన చేశారు. 
 
అయితే, ఐసోలేషన్‌లో ఉన్న ఆ 68మంది ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నదని ఆమె తన ప్రకటనలో పేర్కొన్నారు. కాంటాక్ట్ ట్రేసింగ్‌లో భాగంగా లిస్టవుట్ చేసిన వారి నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షలు చేస్తున్నామని, ఇప్పటివరకు వారిలో 30 మందికి నెగెటివ్ వచ్చిందని ఆరోగ్యమంత్రి వెల్లడించారు.
 
కోజికోడ్‌లో తొలి నిపా కేసు నమోదై 12 ఏండ్ల బాలుడు మృతిచెందినప్పటి నుంచి అంటే గత నాలుగు రోజుల నుంచి కేరళ ఆరోగ్యమంత్రి వీణాజార్జి అక్కడే మకాం వేశారు. ఇదిలావుంటే కాంటాక్ట్ ట్రేసింగ్‌లో భాగంగా ఇప్పటివరకు 251 మందిని లిస్టవుట్ చేశారు.
 
అందులో 129 మంది హెల్త్ వర్కర్లు కాగా, మరో 54 మంది హైరిస్క్ కేటగిరీలో ఉన్నారు. కేవలం 11 మందిలో మాత్రమే నిపా సింప్టమ్స్ ఉన్నాయి. హై రిస్క్ కేటగిరీలో ఉన్న 54 మందిలో కూడా 30 మంది హెల్త్ వర్కర్లు ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments