Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తమిళనాడుకు పాకిన నిఫా వైరస్ : కోయంబత్తూరులో ఫస్ట్ కేసు

Advertiesment
తమిళనాడుకు పాకిన నిఫా వైరస్ : కోయంబత్తూరులో ఫస్ట్ కేసు
, సోమవారం, 6 సెప్టెంబరు 2021 (17:25 IST)
కేరళ రాష్ట్రంలో వెలుగు చూసిన నిఫా వైరస్ ఇపుడు తమిళనాడు రాష్ట్రంలోకి వ్యాపించింది. ఈ వైరస్ బారినపడిన 12 యేళ్ళ కుర్రోడు ప్రాణాలు కోల్పోయాడు. కేరళలో 20 మందిని హై రిస్క్‌ కాంటాక్టులుగా గుర్తించగా.. ఇందులో ఇద్దరు ఆరోగ్య కార్యకర్తల్లో నిపా లక్షణాలు గుర్తించారు. 
 
ఈ వైరస్‌ ప్రస్తుతం తమిళనాడుకు సైతం పాకింది. కోయంబత్తూరు జిల్లాలో తొలి నిపా కేసు నమోదైనట్లు జిల్లా కలెక్టర్‌ జీఎస్‌ సమీరణ్‌ తెలిపారు. కాంటాక్టులను గుర్తిస్తున్నామని, అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అధిక జ్వరంతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన వారందరికీ పరీక్షలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
 
ఈ సందర్భంగా వాలాయార్‌ చెక్‌పోస్ట్‌ వద్ద నిపా వైరస్‌ పర్యవేక్షణ శిబిరాన్ని సందర్శించారు. కేరళ నుంచి తమిళనాడుకు వచ్చే ప్రజలకు కొవిడ్‌ ఆర్టీ పీసీఆర్‌ నెగెటివ్‌ రిపోర్ట్‌ ఉంటేనే రాష్ట్రంలోకి అనుమతి ఇస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైఎస్ వర్థంతికి లేని షరతులు వినాయకచవితికా? చంద్రబాబు ప్రశ్న