Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తమిళనాడులోకి ప్రవేశించిన 15 మంది ఉగ్రవాదులు!

Advertiesment
Tamil Nadu
, శనివారం, 4 సెప్టెంబరు 2021 (10:31 IST)
దక్షిణాది రాష్ట్రాల్లో అతిపెద్ద రాష్ట్రంగా ఉన్న తమిళనాడులోకి ఉగ్రవాదులు ప్రవేశించారని, జాగ్రత్తగా ఉండాలని కేంద్ర హోం మంత్రిత్వశాఖతో పాటు నిఘా వర్గాలు హెచ్చరించాయి. సముద్రమార్గం ద్వారా దాదాపు 15 మంది వరకు రాష్ట్రంలోకి ప్రవేశించారని పేర్కొన్నారు. వీరంతా పాకిస్థాన్‌ చేరుకునేందుకు పథకం వేశారని వెల్లడించింది. 
 
దీంతో రాష్ట్రంలోని కోస్ట్‌గార్డ్‌ దళాలు, ఎన్‌ఐఏ అధికారులు నిఘా పెట్టారు. ఎవరైనా అనుమానాస్పదంగా సంచరిస్తే సమాచారం ఇవ్వాలని స్థానికులను పోలీసులు ఆదేశించారు. ఇదిలావుంటే, చెన్నై పూందమల్లిలోని ఒక అపార్టుమెంటులో అనుమానాస్పదంగా ఉంటున్న ఇద్దరిని పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మా మంచి మాస్టారూ! స్కూలును వీడి పోవ‌ద్దు!!