Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తమిళనాడులో సెప్టెంబర్ 15 వరకు లాక్‌డౌన్‌

తమిళనాడులో సెప్టెంబర్ 15 వరకు లాక్‌డౌన్‌
, మంగళవారం, 31 ఆగస్టు 2021 (21:35 IST)
తమిళనాడులో ఆగస్టు 31వ తేదీతో లాక్ డౌన్ ముగియనుంది.వైరస్ వ్యాప్తి కేసుల దృష్ట్యా లాక్‌డౌన్‌ను సెప్టెంబర్‌ 15వ తేదీ ఉదయం 6 గంటల వరకు పొడిగిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

5వ తేదీ నుంచి ఆదివారాల్లో అన్ని బీచ్‌లలో ఇకపై  విజిటర్ల ప్రవేశంపై నిషేధం విధించారు. వీకెండ్స్ మూడురోజులు (శుక్ర, శని, ఆది) అన్ని ప్రార్థనాలయాలు మూసివేసే ప్రక్రియను కొనసాగిస్తారు.
 
కేరళలో రోజుకు 30వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతుండటంతో తమిళనాడు-కేరళ సరిహద్దు ప్రాంతాలైన కోయంబత్తూరు, కన్యాకుమారీ, తెన్ కాశీ, తేనీ జిల్లాల్లోని చెక్‌పోస్టులను కట్టుదిట్టం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

కేరళ నుంచి వచ్చే ప్రజలకు కరోనా పరీక్షలు చేసిన తర్వాతనే అనుమతించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైసీపీ కుక్కలు సీబీఐ విచారణకు సిద్దమా?: లోకేష్ ఆగ్రహం