Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కడప జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ పర్యటన.. తేదీలు ఖరారు

కడప జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ పర్యటన.. తేదీలు ఖరారు
, మంగళవారం, 31 ఆగస్టు 2021 (08:25 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి తన సొంత జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లాలో సెప్టెంబరు 1, 2 తేదీల్లో పర్యటించనున్నారు. సెప్టెంబరు 2న వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర్భంగా సీఎం ఇడుపులపాయ వెళ్లనున్నారు. 
 
ఇందుకోసం ఆయన సెప్టెంబరు 1న మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో కడప వెళ్లనున్న సీఎం.. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఇడుపులపాయ చేరుకుంటారు. ఆరోజు రాత్రి ఇడుపులపాయ ఎస్టేట్లో సీఎం జగన్ బస చేస్తారు. సెప్టెంబరు 2న ఉదయం వైఎస్ ఘాట్ వద్ద నివాళి అర్పించి తిరుగు ప్రయాణం కానున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. 
 
ఇదిలావుండగా, ప్రస్తుతం సీఎం జగన్ ఉత్తర భారత పర్యటనలో ఉన్నారు. ఈనెల 28న ముఖ్యమంత్రి జగన్ వివాహం జరిగి 25 ఏళ్లు పూర్తయ్యాయి. సందర్భంగా ఆయన కుటుంబంతో కలిసి ఈనెల 26 నుంచి వ్యక్తిగత పర్యటనకు వెళ్లారు. పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించి..రేపు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమ్మతో సహజీవనం.. కుమార్తెపై లైంగికదాడి...