Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వైసీపీ కుక్కలు సీబీఐ విచారణకు సిద్దమా?: లోకేష్ ఆగ్రహం

వైసీపీ కుక్కలు సీబీఐ విచారణకు సిద్దమా?: లోకేష్ ఆగ్రహం
, మంగళవారం, 31 ఆగస్టు 2021 (21:32 IST)
వైసీపీ కుక్కల్ని ప్రశ్నిస్తున్నా, సీబీఐ విచారణకు సిద్దమా? అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. ఏపీలో రోజుకో ఆడబిడ్డ బలైపోతుంటే జగన్మోహన్‌రెడ్డి  సిమ్లాలో ఎంజాయ్ చేసొచ్చారన్నారు.

మంగళవారం  లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పించడంలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యానికి అద్దంపడుతుందన్నారు. ఇక 8 పని దినాలు మాత్రమే మిగిలాయని  బీటెక్‌ విద్యార్ధిని రమ్యని హత్య చేసిన నిందితుడికి ఉరేసి మహిళలకు భరోసా ఇచ్చేది ఎప్పుడు? అని ప్రశ్నించారు.

సీఎం గాలి జగన్‌ నిర్వాసితులను మోసం చేశారని మండిపడ్డారు. అందరికీ ముద్దులు పెట్టి సీఎం అయ్యాడన్నారు. తప్పులు ప్రశ్నిస్తే జైలులో పెడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో జగన్ ఉన్నాడని చెప్పారు. వరద సహాయం 2500 ఇవ్వలేని సీఎం పది లక్షలు ఎలా ఇస్తాడని ఆయన ప్రశ్నించారు.

తండ్రి విగ్రహాలకు 200 కోట్లు ఖర్చు చేస్తున్నాడని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పోలవరం నిర్వాసితుల కోసం ఇచ్చిన 4 వేల కోట్లు తినేశాడని ఆరోపించారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నోరు అదుపులో పెట్టుకో: లోకేష్‌ కు మంత్రి కన్నబాబు వార్నింగ్