కూతురుకు బీర్ తాగించిన తండ్రి.. కేరళలో దారుణం

Webdunia
మంగళవారం, 29 జూన్ 2021 (20:24 IST)
పిల్లలపై ప్రేమతో పాలు ఇవ్వడం మామూలే. కానీ ఇక్కడ ఓ తండ్రి బీర్ కూతురుకు తాగించాడు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. కేరళ రాష్ట్రం కాసర్‌గోడ్ జిల్లాలోని హోస్‌దుర్గ్‌లో మాత్రం ఓ తండ్రి తన కూతురుపై ప్రేమతో ఏకంగా బీరు తాపించాడు. కానీ బీరు తాగిన బాలిక స్పృహ తప్పి ఆస్పత్రి పాలయ్యింది. దాంతో పోలీసులు తండ్రిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు.
 
వివరాల్లోకి వెళ్తే.. హోస్‌దుర్గ్‌లోని తోయమ్మాల్ గ్రామానికి చెందిన రాధాకృష్ణన్ ఇంట్లో బీరు తాగుతూ తన ఎనిమిదేళ్ల కూతురుకు కూడా పట్టించాడు. అయితే ఆ బాలిక కళ్లు తిరిగి పడిపోవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. వైద్యులు జరిగిన విషయం తెలుసుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు బాలిక వాంగ్మూలం నమోదు చేశారు.
 
బాలిక వాంగ్మూలం ఆధారంగా ఆమె తండ్రి రాధాకృష్ణన్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం స్థానిక కోర్టులో హాజరుపర్చగా కోర్టు అతనికి రెండు వారాల జైలుశిక్ష విధించింది. దాంతో పోలీసులు అతడిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments