Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ అమ్మను చంపుతున్నా... రెండేళ్ళ చిన్నారి ముందే తల్లిని నరికి...

Webdunia
మంగళవారం, 29 జూన్ 2021 (19:38 IST)
తిరుపతిలో సంచలనంగా మారిన సాఫ్ట్వేర్ ఉద్యోగి భువనేశ్వరి హత్య కేసులో సంచలన నిజాలు వెలుగుచూస్తున్నాయి. భార్యతో గొడవతో అతి దారుణంగా నరికి చంపిన భర్తను ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అభంశుభం తెలియని రెండేళ్ళ పాప ముందు ఆమె తల్లిని అతి కిరాతకంగా నరికి చంపేశాడు తండ్రి.
 
హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ భువనేశ్వరి స్వస్థలం చిత్తూరు జిల్లా రామసముంద్రం, కడప జిల్లాకు చెందిన శ్రీకాంత్ రెడ్డితో మూడేళ్ల క్రితమే వివాహమైంది. వీరికి రెండేళ్ళ కుమార్తె ఉంది. పనీపాటా లేకుండా జల్సాగే తిరిగే శ్రీకాంత్ రెడ్డి మద్యానికి బానిసయ్యాడు.
 
ప్రతిరోజు మద్యానికి డబ్బులు అడుగుతూ భార్యను ఇబ్బంది పెడుతుండేవాడు. డబ్బులు ఇవ్వకుంటే ఆమెను కొట్టేవాడు. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. కరోనా కారణంగా ఇంటి నుంచే విధులు నిర్వర్తించవచ్చని సాఫ్ట్వేర్ కంపెనీ చెప్పంది. దీంతో శ్రీకాంత్ రెడ్డి తన భార్యను తీసుకుని తిరుపతికి వచ్చేశాడు.
 
తిరుపతి డిబిఆర్ ఆసుపత్రి సమీపంలో ఒక అపార్టుమెంట్‌ను అద్దెకు తీసుకుని ఉండేవారు. ఈ క్రమంలో వారి మధ్య తరచూ గొడవలు జరిగేవి. వీరి గొడవ తారాస్థాయికి చేరడంతో వారంరోజుల క్రితమే అతి కిరాతకంగా ఆమెను తన కుమార్తె ముందు చంపి ముక్కలు ముక్కలు చేసి సూట్ కేసులో ఉంచి తిరుపతిలోని రుయా ఆసుపత్రి వెనుక ఉన్న నిర్మానుష్యమైన ప్రాంతంలో పడేసి కాల్చేశాడు. అత్యంత పాశవికంగా జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించి విజయవాడ సమీపంలోని కోదాడ వద్ద నిందితుడిని తిరుపతి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments