Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళ: బేసిక్ పే రూ.23 వేలు.. గరిష్ట వేతనం రూ.1.66లక్షలు

Webdunia
శుక్రవారం, 29 జనవరి 2021 (20:11 IST)
కేరళ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కనీస బేసిక్ పే రూ.23,000గానూ, గరిష్ఠ వేతనం రూ.1.66 లక్షలుగానూ 11వ వేతన సవరణ కమిషన్ నిర్ణయించింది. కే మోహన్ దాస్ నేతృత్వంలోని కమిషన్ శుక్రవారం ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్‌లకు ఈ సిఫారసులను సమర్పించింది. సవరించిన వేతనాలు 2019 జూలై 1 నుంచి వర్తిస్తాయి.
 
ఇంటి అద్దె అలవెన్స్ కనీసం రూ.1,200, గరిష్ఠంగా రూ.10,000 చెల్లించాలని సిఫారసు చేసింది. విలేజ్ ఆఫీసర్స్‌కు రూ.1,500 ప్రత్యేక భత్యం చెల్లించాలని పేర్కొంది. ఆరోగ్య శాఖలోని పారామెడికల్ సిబ్బందికి జీతాలను ఏకీకృతం చేయాలని పేర్కొంది.
 
ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపుపై ఈ కమిషన్ ఎటువంటి సిఫారసు చేయలేదు. అయితే ఈ ఏడాది పదవీ విరమణ చేయబోతున్న సుమారు 20 వేల మంది ఉద్యోగులకు పదవీ కాలాన్ని ఒక ఏడాదిపాటు పెంచాలని సిఫారసు చేసింది. 
 
వేతన సవరణ వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై అదనంగా రూ.4,810 కోట్ల భారం పడుతుంది. పెన్షన్ గ్రాట్యుయిటీ ఫండ్‌ పరిమితిని రూ.14 లక్షల నుంచి రూ.17 లక్షలకు పెంచాలని సిఫారసు చేసింది. 80 ఏళ్ల వయస్కులైన పింఛనుదారులకు అదనంగా రూ.1,000 చెల్లించాలని పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments