Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వే ప్రయాణికులకు తీపికబురు-అందుబాటులోకి ప్రైవేట్ ట్రైన్స్

Webdunia
శుక్రవారం, 29 జనవరి 2021 (19:45 IST)
రైల్వే ప్రయాణికులకు తీపికబురు అందింది. కొత్త రైళ్లు అవి కూడా ప్రైవేట్ ట్రైన్స్ అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ విషయం ఆర్థిక సర్వేలో వెల్లడైంది. ఈ ఏడాదిలోనే బిడ్స్ ప్రక్రియ పూర్తి కానుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను ఆవిష్కరించారు. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రతిబింబించే ఈ ఎకనమిక్ సర్వేలో పలు కీలక అంశాలు వెల్లడయ్యాయి. ఆర్థిక సర్వే ప్రైవేట్ ట్రైన్స్ అంశాన్ని కూడా ప్రస్థావించింది. 
 
ప్రైవేట్ ట్రైన్స్ కోసం బిడ్స్ ఆహ్వానం 2021 మే చివరకు పూర్తవుతుందని తెలిపింది. ప్రైవేట్ ట్రైన్స్ 2023-24 కల్లా అందుబాటులోకి రావొచ్చని ఆర్థిక శాఖ పేర్కొంది. అలాగే ఎయిర్ ట్రావెల్ 2021 ఆర్థిక సంవత్సరం తొలి నాళ్లలలోనే ప్రీ-కోవిడ్ స్థాయికి చేరొచ్చని తెలిపింది. ఫార్మా రంగానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, అలాగే ఆర్‌అండ్‌డీ కోసం అధిక కేటాయింపులు జరపాల్సి ఉందని సూచించింది.
 
డిజిటల్ హెల్త్ మిషన్‌ పూర్తి చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే టెలీమెడిసిన్‌పై ఇన్వెస్ట్ చేయాల్సి ఉందని సూచించింది. అలాగే 2021-22 ఆర్థిక సంవత్సరంలో (2021 ఏప్రిల్ నుంచి 2022 మార్చి వరకు) జీడీపీ 11శాతం మేర పెరగొచ్చని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 7.7 శాతం మేర తగ్గొచ్చని, కానీ తర్వాత వీ షేప్ రికవరీ ఉంటుందని పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments