Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వణికిస్తున్న బర్డ్ ఫ్లూ... పది రాష్ట్రాల్లో విజృంభణ.. కేంద్రం హైఅలెర్ట్

వణికిస్తున్న బర్డ్ ఫ్లూ... పది రాష్ట్రాల్లో విజృంభణ.. కేంద్రం హైఅలెర్ట్
, మంగళవారం, 12 జనవరి 2021 (11:19 IST)
దేశంలో బర్డ్ ఫ్లూ వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. హర్యానా రాష్ట్రంలో వెలుగు చూసిన ఇది మెల్లగా పంజాబ్, కేరళ రాష్ట్రాలకు వ్యాపించింది. ఇపుడు ఏకంగా పది రాష్ట్రాల్లో వెలుగు చూసింది. 
 
ఢిల్లీ, ఉత్తరాఖండ్, మహారాష్ట్రలో సోమవారం వందలాది పక్షులు మృతి చెందాయి. దీంతో మొత్తం 10 రాష్ట్రాలకు ఇది సోకింది. ఇప్పటికే కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, గుజరాత్, యూపీ బర్ద్ ఫ్లూతో సతమతమవుతున్నాయి. 
 
పౌల్ట్రీ ఫారాలు, జూలు వంటివాటి చోట్ల నిఘా పెంచాలని, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీచేశారు. 
 
అదేసమయంలో బర్ద్ ఫ్లూ మనుషులకు వ్యాపించదని, ఆ భయం అక్కర్లేదని కేంద్రం స్పష్టం చేసింది. ప్రజలు చికెన్, కోడిగుడ్లు తినవచ్చునని, అయితే బాగా ఉడికించిన వీటినే తినాలని సూచించింది. ఎక్కువ ఉష్ణోగ్రతలో వైరల్ నశించిపోతుందని పేర్కొంది.
 
కాగా, వివిధ రాష్ట్రాలు ఇప్పటికే బర్ద్ ఫ్లూ నేపథ్యంలో వివిధ నివారణా చర్యలు చేపట్టాయి. మరణించిన పక్షుల నమూనాలను విశ్లేషిస్తున్నారు . కోడిగుడ్లు, చికెన్ తినవచ్చునని యాడ్స్ ఇస్తున్నాయి. కానీ, కేరళ వంటి రాష్ట్రాల్లో చికెన్ మాంసం విక్రయాలపై నిషేధాజ్ఞలు విధించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రోడ్డుప్రమాదంలో కేంద్ర మంత్రికి తప్పిన ముప్పు.. కాని సతీ వియోగం