Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ దైన్యస్థితి ఏంటో దేశానికి తెలుసు : జగన్‌కు జేఎంఎం కౌంటర్

Webdunia
ఆదివారం, 9 మే 2021 (09:53 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మద్దతుగా చేసిన ట్వీట్​కు ఝార్ఖండ్ ముక్తి మోర్చా కౌంటర్ ఇచ్చింది. చంద్రబాబుకు వ్యతిరేకంగా జగన్ స్నేహం చేస్తున్నట్లు జేఎంఎం ఆరోపించింది. ప్రధాని మోడీపై ఝార్ఖండ్ సీఎం చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి జగన్ ఖండించిన నేపథ్యంలో ఆయన ట్వీట్‌కు ఝార్ఖండ్ ముక్తి మోర్చా కౌంటర్ ఇచ్చింది. 
 
కేంద్రం వైఖరితో చాలా రాష్ట్రాలు ఇబ్బంది పడుతున్నా.. ఏపీ సీఎం జగన్ మాత్రం సొంత ఆసక్తితో భాజపాకు మద్దతు తెలుపుతున్నారని ఆక్షేపించింది. ఏపీ సీఎం జగన్ కన్నా.. ఝార్ఖండ్ సీఎం ఎంతో పరిణతి కలవారని.. జేఎంఎం ప్రధాన కార్యదర్శి సుప్రియో భట్టాచార్య అన్నారు. 
 
అంతకుముందు... 'ప్రధాని తన మన్‌కీ బాత్‌తోపాటు... మేం చెప్పింది కూడా వింటే బాగుండేది' అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలను జగన్‌ తప్పుపట్టిన సంగతి తెలిసిందే.
 
'ఇలాంటి రాజకీయాలతో దేశం బలహీనపడుతుంది. కొవిడ్‌పై యుద్ధం చేస్తున్న మోడీని బలోపేతం చేద్దాం' అని జగన్‌ ట్వీట్‌ చేశారు. దీనిపై... జేఎంఎం శనివారం ట్విట్టర్‌లోనే కౌంటర్‌ ఇచ్చింది.
 
'వైఎస్‌ జగన్‌ జీ! మీ నిస్సహాయత గురించి దేశమంతటికీ తెలుసు.  మేం మీ పట్ల ప్రేమాభిమానాలు చూపుతున్నాం. మీరు ఎల్లప్పుడూ సుఖంగా ఉండాలి' అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. కాగా, జగన్ బెయిల్ పిటిషన్ త్వరలో విచారణకు రానుంది. అందుకే మోడీపై జగన్ భక్తిభావం చూపుతూ ట్వీట్ చేశారన్నది ప్రతి ఒక్కరికీ తెలిసిందే.

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments