Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెట్లెక్కుతున్న ఉపాధ్యాయులు.. ఎందుకో తెలుసా?

జార్ఖండ్ రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు లేనిపోని కష్టాలు వచ్చిపడ్డాయి. ముఖ్యంగా, మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయుల కష్టాలు అన్నీఇన్నికావు. తాము పాఠశాలకు వచ్చినట్టుగా హాజరు వే

Webdunia
శుక్రవారం, 5 అక్టోబరు 2018 (13:22 IST)
జార్ఖండ్ రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు లేనిపోని కష్టాలు వచ్చిపడ్డాయి. ముఖ్యంగా, మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయుల కష్టాలు అన్నీఇన్నికావు. తాము పాఠశాలకు వచ్చినట్టుగా హాజరు వేసేందుకు వారు చెట్లు ఎక్కాల్సి వస్తోంది. అటెండెన్స్ కోసం టీచర్లు చెట్టు ఎక్కడం ఏంటి అనే కదా మీ ధర్మసందేహం. అయితే, ఈ కథనం చదవండి...
 
జార్ఖండ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయుల అటెండెన్స్‌ను ట్యాబ్లెట్లలో నమోదు చేయాల్సి వుంది. ఈ-విద్యా వాహిని ఆప్ ద్వారా తాము విధులకు హాజరైనట్టు అటెండెన్స్ వేసుకోవాలి. 
 
కానీ పాఠశాల అటవీ ప్రాంతంలో ఉండటంతో సరైన సెల్‌ఫోన్ సిగ్నల్స్ అందడం లేదు. దీని కోసం పాఠశాల ఆవరణలోని చెట్లను ఎక్కాల్సి వస్తోంది. మరి 20 సంవత్సరాల పైవయసున్న వారు చెట్లు బాగానే ఎక్కి ట్యాబ్లెట్‌లో హాజరు నమోదు చేసుకుంటున్నారు. కానీ 40 యేళ్ల వయసున్న స్త్రీ పురుష టీచర్లు చెట్లు ఎక్కడం కష్టంగా మారింది. 
 
దీంతో వారు తమ హాజరు శాతాన్ని నమోదు చేసుకోలేకపోతున్నారు. ఈ స్కూల్‌లో ఉన్న ఆరుగురు ఉపాధ్యాయులు.. హాజరు నమోదు విషయంలో నానా ఇబ్బందులు పడుతున్నారు. 2017లో జ్ఞానోదయ స్కీం కింద ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రఘుబర్ దాస్.. ప్రభుత్వ పాఠశాలలకు ట్యాబెట్లు పంపిణీ చేశారు. ఈ-విద్యా వాహిని ఆప్ ద్వారా ఉపాధ్యాయులు తమ అటెండెన్స్‌ను నమోదు చేసుకోవాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments