Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎలుకలకు పెట్టిన మందు తిని 12 నెమళ్లు మృతి

Webdunia
ఆదివారం, 13 మార్చి 2022 (11:48 IST)
తమిళనాడు రాష్ట్రంలో విషాదకర ఘటన జరిగింది. ఎలుకలను చంపేందుకు పెట్టిన మందు తిని 12 నెమళ్లు మృత్యువాతపడ్డాయి. ఈ ఘటనకు కారణమైన రైతుని స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. 
 
ఈ హృదయవిదారక ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తిరుపత్తూరు జిల్లా వాణియంబాడి సమీపంలోని నాచ్చియార్ కుప్పం అనే ప్రాంతంలో జరిగింది. ఈ గ్రామానికి చెందిన షణ్ముగం (75) అనే వ్యక్తి కొన్ని నెలల క్రితం ఓ మహిళకు చెందిన భూమిని కౌలుకు తీసుుకుని సాగు చేశాడు. 
 
అయితే, ఈ సాగు చేతికొచ్చే సమయంలో ఎలుకలు, నెమళ్లు ధ్వంసం చేయడాన్ని గమనించారు. దీంతో ఎలుకలను చంపేందుకు పొలంలో మందు పెట్టాడు. ఈ మందును నెమళ్లు ఆరగించాయి. దీంతో అవి ప్రాణాలు కోల్పోయాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు... చనిపోయిన నెమళ్ళను స్వాధీనం చేసుకున్నారు. అలాగే, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు రైతును అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments