Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారణాసి భద్రత పెంపు.. స్మార్ట్ నిఘా వ్యవస్థ.. నేరగాళ్లకు చుక్కలే..

Webdunia
బుధవారం, 25 నవంబరు 2020 (10:40 IST)
వారణాసిలో భద్రత మరింత పెరగనుంది. నిత్యం లక్షలాది మంది భక్తులు సందర్శిస్తున్న వారాణాసి నగరంలో స్మార్ట్ నిఘా వ్యవస్థ ఏర్పాటుతో నేరగాళ్ల సంచారంపై నిఘా పెరగనుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సొంత నియోజకవర్గ కేంద్రమైన ప్రముఖ పుణ్యక్షేత్రం కాశీలో 3వేల సీసీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. 
 
అధునాతన భారతీయ, యూరోపియన్, అమెరికన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ముఖ గుర్తింపు కెమెరాలను ఏర్పాటు చేసినట్లు వారణాసి స్మార్ట్ సిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్ గౌరంగ్ తెలిపారు. 
 
అవసరమైతే ముఖ గుర్తింపు కెమెరాల సంఖ్యను పెంచుతామని ఆయన చెప్పారు. 720 ప్రాంతాల్లో ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వీటిని కమాండ్ కంట్రోల్ సెంటరుతో అనుసంధానించారు. రూ.128 కోట్లతో ఆప్టికల్ ఫైబర్ లైన్ వేస్తున్నామని కమిషనర్ చెప్పారు.
 
ముఖ గుర్తింపు కెమెరాలు నేరస్థులను సులభంగా పట్టుకుంటాయని కమిషనర్ చెప్పారు. వాంటెడ్ క్రిమినల్‌ను ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలో బంధిస్తే, అది కెఐసిసిసి వద్ద విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేస్తుంది. వారు సంబంధిత పోలీస్ స్టేషనుకు తెలియజేస్తారు. దీంతో పోలీసులు వచ్చి నేరస్థుడిని అరెస్టు చేస్తారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments