Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిందీని నిర్బంధం చేస్తే.. దేశం మూడు ముక్కలే : సీఎం స్టాలిన్ హెచ్చరిక

Webdunia
బుధవారం, 19 అక్టోబరు 2022 (12:13 IST)
కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ పాలకులకు తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ గట్టివార్నింగ్ ఇచ్చారు. ఒకే దేశం ఒకే భాష కింద దేశ ప్రజలపై హిందీ భాషను నిర్బంధం చేసి దేశ ప్రజలపై బలవంతంగా రుద్దాలని చూస్తే మాత్రం దేశం మూడు ముక్కలు అవుతుందని హెచ్చరించారు. హిందీ నిర్బంధ అమలును వ్యతిరేకిస్తూ తమిళనాడు అసెంబ్లీ తీర్మానం చేసింది. 
 
ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడుతూ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సారథ్యంలోని అధికార భాషా పార్లమెంటరీ కమిటీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఒక నివేదికను అందజేసిందని, ఆ నివేదికలో ఐఐటీలు, ఐఐఎంలు, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగుతున్న విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థల్లో హిందీ శిక్షణ భాషగా ఉండాలని సిఫార్సు చేసినట్టు తెలిసిందన్నారు. ఇంగ్లీష్‌కు బదులుగా హిందీలో శిక్షణ జరగాలని ప్రతిపాదించినట్టు పేర్కొన్నారు. ఇదే నిజమైతే  ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. 
 
ఒకే దేశం ఒకే భాష నినాదంతో ఇతర భాషలను అణిచివేసేందుకు కేంద్రం యత్నిస్తుందంటూ మండిపడ్డారు. ఆంగ్ల భాషను పూర్తిగా తొలగించే దిశగా అడుగులు వేస్తుందన్నారు. నిజానికి దేశంలో హిందీని నిర్బంధం చేసే పనులు గత 1938 నుంచి జరుగుతూనే ఉన్నాయని, ఆ ప్రయత్నాలను తాము అడ్డుకుంటూనే ఉన్నామని తెలిపారు. తమిళ భాష, తమిళ సంస్కృతిని కాపాడుకోవడానికి ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని ఆయన తెలిపారు. పైగా, హిందీని నిర్బంధం చేస్తే మాత్రం దేశం మూడు ముక్కలు అవుతుందని ఆయన హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments