Webdunia - Bharat's app for daily news and videos

Install App

17 ఏళ్ల బాలుడిని అపహరించిన చైనా సైనికులు

Webdunia
గురువారం, 20 జనవరి 2022 (11:02 IST)
డ్రాగన్ కంట్రీ మరోసారి సరిహద్దుల్లో దుశ్చర్యకు పాల్పడింది. అరుణాచల్ ప్రదేశ్ లోని అప్పర్ సియాంగ్ జిల్లాకు చెందిన 17ఏళ్ల బాలుడు మిరమ్ తరోన్ ను చైనా సైనికులు అపహరించి తీసుకుపోయారు. ఈ విషయాన్ని రాష్ట్రానికి చెందిన ఎంపీ తపిర్ గావో ట్వీట్ చేశారు. 
 
మిరమ్ తరోన్‌ను అపహరించుకుపోయే క్రమంలో అతడి స్నేహితుడు జానీ యాయింగ్ సైతం పక్కనే ఉన్నాడు. కాకపోతే అతడు చైనా సైనికుల నుంచి తెలివిగా తప్పించుకోవడంతో ఈ విషయం వెలుగు చూసింది. 
 
బాలుడ్ని భారత ప్రాదేశిక ప్రాంతమైన లుంగ్తాజోర్ నుంచి మంగళవారం తీసుకువెళ్లినట్టు తపిర్ గావో ప్రకటించారు. ఈ ప్రాంతంలో చైనా 2018లో 3-4 కిలోమీటర్ల రహదారిని అక్రమంగా నిర్మించింది.
 
అతడ్ని వెంటనే విడిపించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నితీష్ ప్రమాణిక్‌ను కోరినట్టు ఎంపీ తెలిపారు. తన ట్వీట్లను ప్రధాని, కేంద్ర హోంశాఖ మంత్రి, రక్షణ మంత్రులకు ట్యాగ్ చేశారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments