Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు తెదేపాకు సోనియా గాంధీ మద్దతు... 2019లో ఏం జరుగబోతోందో?

నిజంగా ఇది సంచలనమే. లోక్‌సభలో టీడీపీ ఎంపీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి సోనియా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ మద్దతు పలికారు. టీడీపీ ఎంపీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదం తెలియజేశారు. అవిశ్వాస తీర్మానం

Webdunia
బుధవారం, 18 జులై 2018 (14:22 IST)
నిజంగా ఇది సంచలనమే. లోక్‌సభలో టీడీపీ ఎంపీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి సోనియా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ మద్దతు పలికారు. టీడీపీ ఎంపీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదం తెలియజేశారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగానే స్పీకర్ సుమిత్రా మహాజన్ ఓటింగ్ నిర్వహించారు. 
 
అవిశ్వాసానికి మద్దతిస్తున్నవారు లేచి నిలబడాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అంతే... టీడీపీ ఎంపీలు లేచి నిలబడగా వారికి మద్దతుగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు లేచారు. ఆ తర్వాత కాంగ్రెస్ సభ్యులు కూడా టీడీపీ తీర్మానాన్ని సమర్థిస్తూ నిలబడ్డారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ టీడీపీ ఇచ్చిన తీర్మానానికి మద్దతిస్తూ లేచి నిలబడటంతో ఆశ్చర్యం కలిగింది. 
 
వచ్చే 2019 ఎన్నికల్లో ఎన్డీఏను ఢీకొనేందుకు అన్ని పార్టీలు ఏకమవుతాయనేందుకు ఇది నిదర్శనంగా చెప్పవచ్చు. మరోవైపు ఇటీవలే కర్నాటక ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు సైతం రాహుల్ గాంధీతో మంతనాలు చేసిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments