Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చిరంజీవి సినిమాల్లో ఎంతమందిని తొక్కారో... నా నోటికి పని చెప్పొద్దు.. శ్రీరెడ్డి ట్వీట్

ఏపీ ఐటీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు నటి శ్రీరెడ్డి మద్దతుగా నిలిచారు. నారా లోకేశ్‌పై విమర్శలు గుప్పించేవారికి ఆమె పరోక్ష వార్నింగ్ ఇచ్చారు. తెలుగు చిత్రపరిశ్రమలో ఉన్న కాస్టిం

చిరంజీవి సినిమాల్లో ఎంతమందిని తొక్కారో... నా నోటికి పని చెప్పొద్దు.. శ్రీరెడ్డి ట్వీట్
, మంగళవారం, 5 జూన్ 2018 (13:39 IST)
ఏపీ ఐటీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు నటి శ్రీరెడ్డి మద్దతుగా నిలిచారు. నారా లోకేశ్‌పై విమర్శలు గుప్పించేవారికి ఆమె పరోక్ష వార్నింగ్ ఇచ్చారు. తెలుగు చిత్రపరిశ్రమలో ఉన్న కాస్టింగ్ కౌచ్‌పై తన పోరాటం కొనసాగుతుందని ప్రకటించిన శ్రీరెడ్డి.. ఇపుడు లోకేశ్‌కు అండగా నిలిచారు. మెగాస్టార్ చిరంజీవి, ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్‌లను లక్ష్యంగా చేసుకుని ట్వీట్లలో విమర్శలు గుప్పించారు.
 
'నారా లోకేశ్‌‌గారిని ఎవరైనా ఏమైనా అంటే ఊరుకునేవాళ్లు ఎవరూ లేరు. కొత్త పార్టీ ఏం చేస్తుందో అది చెప్పుకోండి. అంతేగానీ లోకేశ్‌ను విమర్శిస్తే ఒప్పుకునేది లేదు. నా నోటికి పని చెప్పొద్దు..' అని ఆమె తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది. అలాగే, చిరంజీవి సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ ఎంత మందిని తొక్కారో ఎవరికి తెలుసంటూ శ్రీరెడ్డి పేర్కొంది. మరోపోస్టులో టీడీపీ అధినేత చంద్రబాబు పాలన, అభివృద్ధిని ప్రశంసిస్తూ, మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసింది. ఇందులో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పేరును ప్రస్తావించకుండా విమర్శలు చేసింది. 
 
"మీ అన్న తిరుపతి నుంచి ఎన్నికైన తర్వాత 5 యేళ్లలో ఒకే ఒక్కసారి తిరుపతికి వచ్చారనీ, వాళ్లకోసం సింగిల్ పైసా ఖర్చు పెట్టలేదనీ, ఎక్కడ కూడా తిరుపతి అభివృద్ధి గురించి మాట్లాడలేదనీ తిరుపతి ప్రజల ఉవాచ. చంద్రబాబుగారు తిరుపతిలో తీసుకొచ్చిన ప్రాజెక్టులు, చేసిన అభివృద్ధి ప్రజలందరికీ తెలుసు. పాలనపై అవగాహన లేనివారిని ఎన్నుకుని తప్పుపని చేయొద్దని నా మనవి" అంటూ రెండో ట్వీట్‌లో పేర్కొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రానా ''అరణ్యం''లో బాలీవుడ్ నటి కల్కి కూచ్లిన్..