Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీనగర్‌లో డ్రోన్లు, మానవరహిత వాహనాలపై నిషేధం

Webdunia
సోమవారం, 5 జులై 2021 (07:12 IST)
జమ్ముకాశ్మీర్‌లోని శ్రీనగర్‌ జిల్లాలో డ్రోన్లు, ఇతర మానవరహిత విహంగ వాహనాలను ఉపయోగించడం, కలిగి ఉండటంపై నిషేధం విధించారు.

జమ్ముకాశ్మీర్‌ పరిపాలన విభాగం ఆదివారం ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. వారం రోజుల క్రితం జమ్ములోని వైమానిక కేంద్రంపై డ్రోన్ల దాడి జరగడంతో ఈ నిషేధం విధించారు.

వాటివల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా ఈ నిషేధం విధించినట్లు శ్రీనగర్‌ జిల్లా మేజిస్ట్రేట్‌ మహమ్మద్‌ అయిజ్‌ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇప్పటికే డ్రోన్‌ కెమెరాలు కలిగి ఉన్నవారు స్థానిక పోలీస్‌ స్టేషన్లలో సమాచారం ఇవ్వాలని ఆదేశించారు.జమ్ముకాశ్మీర్‌లో ఇలాంటి నిషేధం విధించిన రెండో జిల్లాగా శ్రీనగర్‌ నిలిచింది. ఇప్పటికే రాజౌరి జిల్లాలో ఇలాంటి నిషేధం విధించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments