Webdunia - Bharat's app for daily news and videos

Install App

పక్షి ఢీకొట్టడం వల్లే విమాన ప్రమాదమా? పైలెట్ నుంచి మే డే కాల్!

ఠాగూర్
గురువారం, 12 జూన్ 2025 (17:24 IST)
అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే కూలిపోయింది. ఈ మహా విషాదం గురువారం మధ్యాహ్నం 1.43 గంటల సమయంలో జరిగింది. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే, ఈ ప్రమాదానికి కారణం.. విమానాన్ని ఓ పక్షి ఢీకొనడం వల్లే జరిగివుంటుందని నిపుణులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. 
 
ఈ ఘటనపై నిపుణులు స్పందిస్తూ, టేకాఫ్ సమయంలో విమానానికి పక్షి ఢీకొనివుండొచ్చని, దాని కారణంగానే విమానం టేకాఫ్‌కు అవసరమైన వేగాన్ని ఎత్తును అందుకోలేక ప్రమాదానికి దారితీసివుంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. 
 
విమానరంగ నిపుణుడు, మాజీ సీనియర్ పైలెట్ కెప్టెన్ సౌరభ్ భట్నాగర్ స్పందిస్తూ, ప్రాథమికంగా చూస్తే ఇది కొన్ని పక్షుల ఢీకొన్న ఘటనలా కనిపిస్తోంది. దీనవల్ల రెండు ఇంజన్లు శక్తిని కోల్పోయి ఉండొచ్చు. టేకాఫ్ సజావుగానే జరిగింది. అయితే, గేర్లను పైకి తీసుకొచ్చే లోపే విమానం కిందికి దిగడం ప్రారంభించింది. ఇంజన్లు శక్తిని కోల్పోయినపుడు లేదా విమానం పైకి లేచే శక్తిని కోల్పోయినపుడు మాత్రమే ఇలా జరుగుతుంది. అసలు కారణం దర్యాప్తులో తేలుతుంది" అని అన్నారు. 
 
ఈ దృశ్యాలను చూస్తే టేకాఫ్ ఎలాంటి అవాంతరాలు లేకుండా జరిగినట్లుంది. విమానం నియంత్రిత పద్దతిలోనే కిందకు వచ్చింది. పైలెట్ మే డే కాల్ ఇచ్చారు. అంటే అది అత్యవర పరిస్థితి అని అర్థం అని నొక్కి చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

Priyanka Arul : ఓజీ చిత్రం నుండి ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

తర్వాతి కథనం
Show comments