Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరుగుదొడ్డి గోడ కూలి ఐదేళ్ల బాలుడు మృత్యువాత

Webdunia
సోమవారం, 13 మార్చి 2023 (16:23 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. మరుగుదొడ్డి గోడ కూలిపోవడంతో ఐదేళ్ల బాలుడు చనిపోయాడు. నాసిరకమైన మెటీరియల్స్‌తో ఈ గోడను నిర్మించడం వల్లే ఇలా జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. లంఖీపుర్‌ ఖేరీ జిల్లాలో జరిగిన ఈ విషాదకర ఘటన వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని మగల్‌గంజ్ ప్రాంతంలోని చపర్తల గ్రామానికి చెందిన లల్తా ఇంటి బయట ప్రభుత్వ నిధులతో ఓ మరుగిుదొడ్డిని నిర్మించారు. 
 
గత 2016లో నిర్మించగా, ఇందుకోసం నాసికరకం నిర్మాణ సామాగ్రిని వినియోగించారు. పైగా, ఇది నిర్మాణం పూర్తయినప్పటి నిరుపయోగంగానే వుంది. ఈ క్రమంలో శనివారం ఐదేళ్ల బాలుడు తన స్నేహితులతో కలిసి టాయిలెట్ వద్ద ఆడుకుంటున్నాడు. ఆసమయంలో మరుగుదొడ్డి గోడ, సీలింగ్ అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ శిథిలాలు పక్కనే ఆడుకుంటున్న వారిపై పడగా, అందులో ఐదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

సురేష్ ప్రొడక్షన్స్ సెలబ్రేటింగ్ 60 గ్లోరియస్ ఇయర్స్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments