Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మాజీ ప్రియుడిని పార్టీకి ఆహ్వానించి ఇనుప రాడ్‌తో కొట్టి చంపేసింది

murder
, మంగళవారం, 7 మార్చి 2023 (21:04 IST)
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మాజీ ప్రియుడిని పార్టీకి ఆహ్వానించి ప్రియురాలు ఇనుప రాడ్‌తో కొట్టి చంపేసింది. పశ్చిమ బెంగాల్‌లో దుర్గాపూర్ జిల్లా గోపాల్‌మఠ్ పట్టణంలోని జాతీయ రహదారిపై చేతులు కట్టివేయబడిన స్థితిలో యువకుడి మృతదేహం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేపట్టారు. 
 
వివరాల్లోకి వెళితే.. దుర్గాపూర్‌లోని పినజీడి నాగపల్లి ప్రాంతానికి చెందిన అవినాష్ జాన్ (19) అని తేలింది. అనంతరం పోలీసులు ప్రియురాలు అబ్రీన్ వద్ద విచారణ చేపట్టారు. అందులో అబ్రీన్‌కి పిజుపారాకు చెందిన బిట్టు కుమార్ సింగ్‌తో కొత్త ప్రేమ వ్యవహారం ఉన్నట్లు సమాచారం.
 
ఆ తర్వాత వారిద్దరిపై పోలీసులు విచారణ చేపట్టారు. అందులో పార్టీ ఏర్పాటు చేసి మాజీ ప్రియుడు అవినాష్‌ని చంపేందుకు ఆహ్వానించాలని ప్లాన్‌ చేశారు. చెప్పిన రోజు పార్టీకి వచ్చిన అవినాష్‌కు మద్యం ఇచ్చి ఇనుప రాడ్‌తో కొట్టినట్లు సమాచారం. ఇది విని షాక్ తిన్న పోలీసులు వారిద్దరినీ అరెస్ట్ చేసి దుర్గాపూర్ సబ్ డివిజనల్ కోర్టులో హాజరుపరిచారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హనుమంతుడి ఫోటో ముందు బికినీ బాడీబిల్డర్ ఫోజులు