Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్‌-2020 నిరవధిక వాయిదా.. బీసీసీఐ ప్రకటన

Webdunia
బుధవారం, 15 ఏప్రియల్ 2020 (22:58 IST)
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ ఈ ఏడాది కరోనా కారణంగా జరుగుతుందా లేదా అనే దానిపై బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. ఇందులో భాగంగా కరోనా విజృంభించడంతో ఐపీఎల్‌-2020 నిరవధికంగా వాయిదా వేస్తూ బీసీసీఐ ప్రకటించింది. ఈ ఏడాది ఐపిఎల్‌ మార్చి 29నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. కోవిడ్‌-19 కారణంగా 21 రోజుల లాక్‌డౌన్‌తో ఈ టోర్నీని ఏప్రిల్‌ 15వరకూ తొలిసారి వాయిదా వేశారు. 
 
మంగళవారం ప్రధాని లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. 'ఐపిఎల్‌ నిరవధిక వాయిదా గురించి బోర్డు మాకు సమాచారమిచ్చింది. పరిస్థితులు సద్దుమణిగాక ఈ ఏడాది చివర్లోనైనా విండో లభిస్తుందని ఆశిస్తున్నాం' అని ఓ ఫ్రాంచైజీ సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు.
 
కాగా.. 2008లో ఐపిఎల్‌ ఆరంభమయ్యాక ఏప్రిల్‌-మే విండోను కోల్పోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మరోవైపు టి20 ప్రపంచకప్‌ వాయిదా పడితే సెప్టెంబర్‌లో ఐపిఎల్‌ను ఆడిస్తారనే కథనాలు వినిపిస్తున్నాయి. ఈ సీజన్‌ ఐపిఎల్‌పై మే 3 తర్వాతే తుది నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

వైఎస్ జగన్ అనే నేను... జూన్ 9న ఉదయం 9.38 గంటలకు విశాఖలో ప్రమాణ స్వీకారం...

పోస్ట్ పోల్ సర్వే.. టీడీపీ కూటమి విజయం.. వైకాపాకు ఆ ప్రాంతాల్లో పట్టు

ఒకవైపు ఓడిపోతున్నా, చివరి రౌండ్ల వరకూ చూడంటారు, హహ్హహ్హ: ప్రశాంత్ కిషోర్

చీరకట్టులో స్పోర్ట్స్ ‌బైకుపై దూసుకెళ్లిన వరంగల్ ఆంటీ ... అవాక్కమైన మగరాయుళ్లు!! (Video Viral)

ఛత్తీస్‌గఢ్‌లో లోయలోపడిన వాహనం - 17 మంది మృతి

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

తర్వాతి కథనం
Show comments