Webdunia - Bharat's app for daily news and videos

Install App

మృతదేహం ఒక్కసారిగా లేచి నిలబడింది.. అంతే భయంతో పరుగులు!

Webdunia
శుక్రవారం, 10 జనవరి 2020 (15:18 IST)
అంత్యక్రియలు చేస్తుండగా మృతదేహాలు లేచి కూర్చోవడం.. తిరిగి శ్వాస రావడం వంటి వార్తలు వినేవుంటాం.  తాజాగా అలాంటి ఘటన పాకిస్థాన్‌లో  చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కరాచీలో అనారోగ్యంతో బాధపడుతున్న రషీదా బీబీ అనే మహిళను చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. ఆమె శరీరం చికిత్సకు సహకరించకపోవడంతో.. ఆమె మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఆమె డెత్ సర్టిఫికేట్‌ను కూడా ఇచ్చేశారు. దీంతో కుటుంబ సభ్యులు అంత్యక్రియల కోసం ఏర్పాట్లు చేసుకున్నారు. 
 
అయితే అంత్యక్రియల్లోనే షాకిచ్చే సంఘటన చోటుచేసుకుంది. అంత్యక్రియల్లో భాగంగా రషీదా బీబీ మృతదేహానికి స్నానం చేయిస్తుండగా.. ఒక్కసారిగా ఆమె లేచి నిలబడింది. దీంతో అక్కడున్న వారంతా భయంతో పరుగులు తీశారు. 
 
వెంటనే ఆమెను పరీక్షించేందుకు డాక్టర్లను రప్పించారు రషీదా బీబీ కుటుంబ సభ్యులు. వారు పల్స్ చెక్ చేయడంతో ఆమె శ్వాస తీసుకుంటుందని ఆరోగ్యానికి ఢోకాలేదని తెలిపారు. ఆపై చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments