Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆప్ఘనిస్థాన్‌లో నిధుల లేమి.. తాలిబన్ల హెచ్చరిక

Webdunia
గురువారం, 18 నవంబరు 2021 (11:02 IST)
ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్‌లు ఆక్రమించుకున్నాక ఆ దేశానికి చెందిన నిధులను అమెరికా ఫ్రీజ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ దేశం నిధుల లేమితో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. విదేశాల నుంచి వచ్చే దిగుమతులు ఆగిపోయాయి. దేశంలో ఆహార సంక్షోభం తీవ్రంగా వేధిస్తుంది. 
 
శీతాకాలంలో ఈ సమస్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఆహారం, ఉద్యోగ సమస్యలు తీవ్రంగా ఉండటంతో ఆఫ్ఘన్ నుంచి ప్రజలు వలస వెళ్తున్నారు. శీతాకాలంలో ఈ వలసలు మరింతగా పెరిగే అవకాశం ఉన్నది. దీంతో తాలిబన్ నేతలు ప్రపంచానికి హెచ్చరికలు చేస్తున్నారు.
 
తమకు రావాల్సిన 9 బిలియన్ డాలర్ల నిధులను వెంటనే విడుదల చేయాలని, లేదంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి వలసలు పెరిగే అవకాశం ఉంటుందని, వలసలతో ప్రపంచ దేశాలు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని తాలిబన్ నేతలు హెచ్చరించారు. అమెరికా తమ సెంట్రల్ బ్యాంక్ నిధులను, ఆస్తులను స్తంభింపజేయడం ఆశ్చర్యంగా ఉందని, దోహ ఒప్పందానికి విరుద్దంగా అమెరికా ప్రవర్తిస్తోందని తాలిబన్ నేతలు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కలర్ ఫొటో, బేబి మేకర్స్ కొత్త సినిమా టైటిల్, గ్లింప్స్ రిలీజ్

CM: కృష్ణ గారి జయంతినాడు గుర్తుచేసుకున్న చంద్రబాబు

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments