Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టీమిండియా ఆశలన్నీ ఆప్ఘనిస్థాన్ మ్యాచ్‌‍పైనే? సెమీస్ బెర్త్‌కు అద్భుతమే జరగాలి!

Advertiesment
ICC T20 World Cup
, శనివారం, 6 నవంబరు 2021 (12:12 IST)
ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా భారత్ క్రికెట్ జట్టు సెమీస్ స్థానం కోసం నానా తిప్పలు పడుతోంది. సెమీస్‌లోకి అడుగుపెట్టాలంటే కోహ్లీ సేనకు ఏదైనా అద్భుతమే జరగాల్సివుంది. లేనిపక్షంలో ఈ నెల 8వ తేదీన నమీబియాతో జరిగే మ్యాచ్ తర్వాత మూటముల్లె సర్దుకుని ఫ్లైటెక్కాల్సివుంటుంది. 
 
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో భారత క్రికెట్టు ఆరంభంలో పేలవమైన ఆటతీరుతో ప్రతి ఒక్కరినీ నిరాశపరిచింది. ముఖ్యంగా, పాకిస్థాన్, న్యూజిలాండ్ చేతుల్లో చిత్తుగా ఓడిపోయింది. దీంతో సెమీస్ ఆశలు గల్లంతయ్యాయి. ఇపుడు సెమీస్ బెర్త్ దక్కించుకోవాలంటే పోరాడక తప్పనిసరి పరిస్థితిలోకి వెళ్లిపోయింది. 
 
ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన కోహ్లీ సేన తీవ్ర నిరాశ పర్చింది. ప్రస్తుతం భారత్‌ సెమీస్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ అద్భుతం జరగాలి. ఇప్పుడున్న పరిస్థితిలో భారత్‌ సెమీస్ చేరాలంటే స్కాంట్లాండ్‌పై, నవంబర్‌8న నమీబియాపై భారీ తేడా(80 పరుగుల తేడాతో లేదా12 ఓవర్లలో చేధన)తో గెలవాలి. 
 
ఇలా గెలిచిన కూడా న్యూజిలాండ్‌ జట్టు ఆప్ఘానిస్థాన్‌ చేతిలో తప్పనిసరిగి ఓడిపోవాల్సి ఉంటుంది. 6 పాయిం ట్లతో ఉన్న న్యూజిలాండ్‌.. ఆప్ఘానిస్థాన్‌పై గెలిస్తే నేరుగా సెమీస్‌కు వెళ్తుంది. అప్పుడు భారత్‌, ఆప్ఘాన్‌ ఇంటిదారి పడతాయి. 
 
ఒకవేళ ఆప్ఘాన్‌ గెలిస్తే నెట్‌ రన్‌రేట్‌ కీలకం కానుంది. ఇంతకముందే పాకిస్థాన్ సెమీస్ చేరగా, మరో జట్టుకు మాత్రమే సెమీస్‌ అవకాశాలు ఉన్నాయి. భారత్‌ సెమీస్‌ చేరాలంటే ఈ అద్భుతం జరగాలి మరీ.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా ప్రియురాలి పేరు అతియా శెట్టి.. పరిచయం చేసిన భారత ఓపెనర్