Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐక్యరాజ్యసమితిలో మసూద్‌పై ఈసారి అమెరికా వంతు?

Webdunia
గురువారం, 28 మార్చి 2019 (15:10 IST)
భారత్ పదేపదే అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చాల్సిందిగా సూచిస్తున్న పాక్‌ ఉగ్రనేత మసూద్‌ అజార్‌ను బ్లాక్‌ లిస్ట్‌లో చేర్చేందుకు ఈసారి అమెరికా చర్యలు మొదలు పెట్టింది. ఇప్పటివరకు భారత్ ఐక్యరాజ్య సమితిలో మూడుసార్లు ఈ ప్రతిపాదనను ఉంచగా ప్రతిసారీ చైనా కారణంగానే ఈ ప్రతిపాదన వీగిపోయింది. 
 
తాజాగా ఈ ప్రతిపాదనను అమెరికా చేపట్టింది. బ్రిటన్‌, ఫ్రాన్స్‌తో కలిసి మసూద్‌ను బ్లాక్‌ లిస్ట్‌లో చేర్చేందుకు సరికొత్త తీర్మానాన్ని తయారీ చేసి 15 సభ్యదేశాలకు కాపీలను అందజేసింది.
 
దీనిలో మసూద్‌పై ఆంక్షలు విధించాలని, ప్రయాణాలను నిషేధించాలని, ఆస్తులను స్తంభింపజేయాలని పేర్కొన్నారు. ఐసిస్‌, అల్‌ఖైదాతో జైషేనేతకు సంబంధాలు ఉన్నాయని అమెరికా పేర్కొంది. ఆయా సంస్థలకు ఆర్థిక సాయం అందించడం, ప్రణాళికలు రూపొందించడం, ఏర్పాట్లు చేయడం, మద్దతు తెలుపడం వంటివి చేశారని పేర్కొన్నది. 
 
భారత్ రెండు వారాల క్రితం తీసుకొచ్చిన ఒక తీర్మానాన్ని చైనా నిలిపి ఉంచి చివరలో వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు అమెరికా మరో తీర్మానంతో ముందుకు రావడం విశేషం. ఈ నేపథ్యంలో చైనా దీనిని మరోసారి అడ్డుకొంటుందేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం