Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐక్యరాజ్యసమితిలో మసూద్‌పై ఈసారి అమెరికా వంతు?

Webdunia
గురువారం, 28 మార్చి 2019 (15:10 IST)
భారత్ పదేపదే అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చాల్సిందిగా సూచిస్తున్న పాక్‌ ఉగ్రనేత మసూద్‌ అజార్‌ను బ్లాక్‌ లిస్ట్‌లో చేర్చేందుకు ఈసారి అమెరికా చర్యలు మొదలు పెట్టింది. ఇప్పటివరకు భారత్ ఐక్యరాజ్య సమితిలో మూడుసార్లు ఈ ప్రతిపాదనను ఉంచగా ప్రతిసారీ చైనా కారణంగానే ఈ ప్రతిపాదన వీగిపోయింది. 
 
తాజాగా ఈ ప్రతిపాదనను అమెరికా చేపట్టింది. బ్రిటన్‌, ఫ్రాన్స్‌తో కలిసి మసూద్‌ను బ్లాక్‌ లిస్ట్‌లో చేర్చేందుకు సరికొత్త తీర్మానాన్ని తయారీ చేసి 15 సభ్యదేశాలకు కాపీలను అందజేసింది.
 
దీనిలో మసూద్‌పై ఆంక్షలు విధించాలని, ప్రయాణాలను నిషేధించాలని, ఆస్తులను స్తంభింపజేయాలని పేర్కొన్నారు. ఐసిస్‌, అల్‌ఖైదాతో జైషేనేతకు సంబంధాలు ఉన్నాయని అమెరికా పేర్కొంది. ఆయా సంస్థలకు ఆర్థిక సాయం అందించడం, ప్రణాళికలు రూపొందించడం, ఏర్పాట్లు చేయడం, మద్దతు తెలుపడం వంటివి చేశారని పేర్కొన్నది. 
 
భారత్ రెండు వారాల క్రితం తీసుకొచ్చిన ఒక తీర్మానాన్ని చైనా నిలిపి ఉంచి చివరలో వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు అమెరికా మరో తీర్మానంతో ముందుకు రావడం విశేషం. ఈ నేపథ్యంలో చైనా దీనిని మరోసారి అడ్డుకొంటుందేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం