Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సెల్ఫీ పిచ్చి బాగా ముదిరిపోయింది.. సెల్ఫీ మృతుల్లో భారతీయులే..?

Advertiesment
సెల్ఫీ పిచ్చి బాగా ముదిరిపోయింది.. సెల్ఫీ మృతుల్లో భారతీయులే..?
, శుక్రవారం, 5 అక్టోబరు 2018 (18:08 IST)
ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం.. సెల్ఫీ మరణాలు పెరిగిపోతున్నాయి. అక్టోబర్ 2011 నుంచి నవంబర్, 2017 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా సెల్ఫీల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 259గా ఉంది. 
 
సెల్ఫీ మృతుల్లో అత్యధిక శాతం భారత్‌లోనే వుండటం షాక్‌ ఇచ్చే విషయం. భారత్ తర్వాతి స్థానంలో రష్యా, అమెరికా, పాకిస్థాన్ లు ఉన్నాయి. సెల్ఫీల కారణంగా మరణించిన వారిలో అత్యధికులు (72 శాతం) పురుషులు, అందులోనూ 30 ఏళ్ల లోపు వారే ఉన్నారు.
 
అలా సెల్ఫీ మోజులో పడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరిగిపోతుండటంతో, ఇప్పటికే దేశంలో కొన్ని ప్రదేశాలను నో సెల్ఫీజోన్‌లుగా ప్రకటించారు. ఎంత మంది ప్రాణాలు కోల్పోతున్నా స్మార్ట్ ఫోన్ యూజర్లు సెల్ఫీ పిచ్చి మాత్రం వీడడం లేదు. 
 
ఎత్తులో నుంచి కిందకు దూకి సెల్ఫీ కోసం ప్రయత్నించడం.. రైలు వస్తుండగా సెల్ఫీ తీసుకోవడం వంటి సెల్ఫీ మృతులకు ప్రధాన కారణాలవుతున్నాయని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్నికల కోసం పెట్రోల్ ధరలు పెంచారా..? కేంద్రంపై నెటిజన్ల ఫైర్